YS Jagan : Why Not 175… భీమిలి నుండి ప్రచారాలు ప్రారంభించిన వైయస్ జగన్…!

Advertisement
Advertisement

YS Jagan : ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసిపి అన్ని రకాలుగా సిద్ధమై కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అభ్యర్థుల మార్పు చేర్పులను వ్యవహారాలను చక్కబెడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది జగన్ ప్రభుత్వం. వై నాట్ 175 లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే భీమిలి నుంచి ఎన్నికల సమరశంఖం పూర్తి చేయనున్నారు. ఇక ఈరోజు నుండి ఎన్నికలు పూర్తయ్యే వరకు పట్టు వదలకుండా గెలుపే లక్ష్యంగా నిలబడే క్యాడర్ కు సీఎం జగన్ దిశ నిర్దేశం చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలోని వైసీపీ క్యాడర్ మొత్తం ” ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందె వరకు అలుపు లేదు ” మనకు అనే రీతిలో ముందుకు సాగుతుంది. ఇక జగన్ పరిపాలన ఎలా ఉంటుందో తెలియక ముందే 151 అసెంబ్లీలు 23 ఎంపీ స్థానాలు గెలుచుకున్న వైసిపి పార్టీ..ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుని , కరోనా వంటి అతి క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొని , ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిన జగన్ పాలన చూసిన ప్రజలు 175 + 25 పెద్ద సమస్య కాదని వైసిపి అభ్యర్థులు భావిస్తున్నారు.

Advertisement

ఇక ఈ ఎజెండాను దృష్టిలో పెట్టుకొని క్యాడర్ ను మరింత ఉత్తేజపూరితంగా మరింత బలంగా మరోసారి అధికారంలోకి వచ్చే లక్ష్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సమర శంఖం పూరించింది. దీనిలో భాగంగానే రానున్న ఎన్నికల సమరానికి వైసీపీ శ్రేణులను సిద్ధం చేసేందుకుగాను ముఖ్యమంత్రి జగన్ నేటి నుండి విశాఖ మరియు భీమిలి నియోజకవర్గం లో పర్యటించనున్నారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు విజయనగరం మరియు సార్వతీపురం , మన్యం జిల్లాలనుండి భారీ ఎత్తున వైసిపి పార్టీ శ్రేణులు బహిరంగ సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఈ భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న విశాఖ జిల్లాలోని విశాఖపట్నం భువనేశ్వర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న , తగరపువలస మూడు కోవెళ్ళు ఎదురుగా ఉన్న ,ల్విశాలవంతమైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక ఈ స్థలం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుందని సమాచారం. ఇక ఈ భారీ బహిరంగ సభలో వైయస్ జగన్ వైసిపి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక ఇదే సమయంలో నియోజకవర్గాల లోని పలువురు కార్యకర్తలతో జగన్ ముచ్చటించనున్నారు.

Advertisement

అయితే ఇప్పటికే సామాజిక సమీకరణాలు మరియు సర్వేల ఫలితాలు , ప్రజల అభిప్రాయాలు కార్యకర్తల సూచనల మేరకు పలు నియోజకవర్గాలలో జగన్ అభ్యర్థులను మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైనాట్ 175 కి ఇబ్బంది కలిగించే ఏ చిన్న సమస్యనైనాజగన్ లైట్ తీసుకోవడం లేదు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 58 శాసనసభ మరియు 10 లోక్ సభ స్థానాలకు సమన్వయ కార్యకర్తలను జగన్ నియమించారు. దీంతో గత ఎన్నికల కంటే కూడా ప్రస్తుత ఎన్నికల కోసం జగన్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలోని భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పటికే విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇక ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ కు ఇబ్బందులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ భారీ బహిరంగ సభ ఈరోజు మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

Advertisement

Recent Posts

Viral News : వావి వరసలు మరచి ఇంత నీచానికి పాల్పడతారా ? ఇది చదివితే ఛీ అనకుండ ఉండలేరు !!

Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…

18 minutes ago

Vijay – Rashmika : విజయ్ – రష్మిక పెళ్లి వీడియోపై భారీ డీల్.. ఓటీటీలకు జంట నిర్ణయం చర్చనీయాంశం ..!

Vijay - Rashmika : టాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…

59 minutes ago

Ys Jagan : డిల్లీ పీఠం దద్దరిల్లే లా YCP సంచలన నిర్ణయం , వైఎస్ జ‌గ‌న్‌ కోసం ఏపీ కి డిల్లీ పెద్దలు..!

Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Ys Jagan అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి  భద్రత విషయంలో…

2 hours ago

Jani Master : నాకు ఈ పిల్ల దొరికింది కన్నీళ్లు పెట్టించిన జాని మాస్టర్..!

Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ప్రముఖ…

3 hours ago

Ambati Rambabu : కొండంత సింపతీ.. అంబటి రాంబాబుకి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చిన చంద్రబాబు..!

Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…

4 hours ago

Ration cards : బిగ్‌ బ్రేకింగ్ న్యూస్ .. రేషన్ కార్డులపై శుభవార్త తెలిపిన ప్రభుత్వం…!

Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…

5 hours ago

Driving Licence : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఈ మార్పులు తప్పనిసరి .. లేకపోతే ఇబ్బందులే..!

Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…

6 hours ago

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…

7 hours ago