Allu Aravind : ప్రముఖ జర్నలిస్టు సురేశ్ కొండేటి గురించి తెలుసు కదా. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఒక వివాదంలో చిక్కుకున్నారు. సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ విషయమై ఈ వివాదం ఇండస్ట్రీలో రచ్చ రచ్చ అవుతోంది. ఈ విషయంపై తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఒక విషయం వివాదంలోకి వెళ్లింది. ఒక జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా తను అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఒకటి గోవాలో చేయాలనుకున్నారు. ఏదో కారణాల వల్ల చేయలేకపోయారు. అక్కడికి తీసుకెళ్లిన వాళ్లు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే మీడియా మాత్రం మా కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి గురించి ఆయన పీఆర్వో అంటూ రాశాయి. ఇవాళ పొద్దున చూసి ఆయన పీఆర్వో అని ఎప్పుడైనా చెప్పారా అఫిషియల్ గా అతడికి. ఎప్పుడైనా ఫోటోల్లో అతడి పక్కన కనబడుతుంటే.. ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఫోటోలు దిగుతారు. వాటిని పట్టుకొని ఆయన పీఆర్వో అని రాయడం కరెక్ట్ కాదు అని అల్లు అరవింద్ మండిపడ్డారు.
అతడు తన వ్యక్తిగతంగా ఏదో చేసుకుంటూ అతడు ఫెయిల్ అయినందు వల్ల ఇతర పత్రికలు కానీ.. మీడియా కానీ.. వాటిని అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. కొన్ని ఇతర భాషల వారికి ఇబ్బందులు పడ్డాయి. దాని వల్ల తెలుగు ఇండస్ట్రీని వాళ్లు బ్లేమ్ చేస్తున్నారు. ఇది వ్యక్తిగత విషయం. దానికి.. తెలుగు ఇండస్ట్రీకి ఏంటి సంబంధం. ఏదో తెలుగు ఇండస్ట్రీ ఇంతే.. తెలుగు ఇండస్ట్రీలో మనుషులు ఇంతే అని ఇతర భాషల వాళ్లు మాట్లాడటం కానీ.. కొన్ని పత్రికల్లో అవి రావడం కానీ.. ఇవాళ ఉదయం పత్రికల్లో చూసి బాధపడ్డా అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
ఇది ఒక వ్యక్తి చేసిన దానికి ఎవరికో దాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు. దయచేసి వాళ్లందరికీ నా విన్నపం ఏంటంటే ఆయన ఎవ్వరికీ పీఆర్వో కాదు.. మా కుటుంబంలో ఎవ్వరికీ పీఆర్వో కాదు. అతడు ఇండస్ట్రీకి ఏదో ద్రోహం చేయాలని కాదు. అతడి పర్సనల్ ఫెయిల్యూర్. దాన్ని తెలుగు ఇండస్ట్రీ మీదికి తీసుకురావడం కరెక్ట్ కాదు అంటూ అరవింద్ మీడియాకు క్లారిటీ ఇచ్చారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.