Home » Entertainment » Allu Arjun Fans Tension About Pushpa Part 2 Climax
Entertainment

Pushpa : కన్ఫ్యూజన్ లో సుకుమార్… టెన్షన్ లో పుష్ప అభిమానులు

Authored By
Himanshi
The Telugu News | Published on: February 25, 2022, 7:30 pm
Advertisement

Pushpa Part 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఊహించిన దానికి డబల్ వసూళ్ల ను దక్కించుకుంది. ఈ సినిమాను నిర్మించిన నిర్మాత లు కూడా ఈ స్థాయి లో వసూలు వస్తాయని ఊహించి ఉండరు. ఏకంగా 350 కోట్ల రూపాయల వసూలు దక్కించుకున్న పుష్ప సినిమా ప్రస్తుతం పార్ట్ 2 తెరకెక్కించే పనిలో దర్శకుడు సుకుమార్ ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ పార్ట్ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తి చేశాడు. కానీ పార్ట్‌ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా పార్ట్ 2 సంబంధించిన స్క్రిప్ట్ ని మార్చడం జరుగుతుందని సమాచారం అందుతోంది.

Advertisement

ముందుగా అనుకున్నదాని ప్రకారం అయితే క్లైమాక్స్ సాడ్ ఎండింగ్‌ ఉంటుందని అనుకున్నారు. అంటే అల్లు అర్జున్‌ చనిపోవడం లేదంటే జైలుకు వెళ్లడం జరుగుతుంది. కానీ మా అల్లు అర్జున్ అభిమానులు మరియు తెలుగు ప్రేక్షకులు అలాటి ఎండింగ్‌ ను కోరుకోవడం లేదు. ఖచ్చితంగా అలాంటి క్లైమాక్స్ ని ఇస్తే సినిమాను తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే దర్శకుడు సుకుమార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ కొత్త క్లైమాక్స్ ని రాయడం జరిగిందట.సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో గందరగోళంలో ఉంటే.. అభిమానులు మాత్రం ఎలాంటి సినిమా తీస్తాడో అనే టెన్షన్ లో ఉన్నారట.

allu arjun fans tension about pushpa part 2 climax

Advertisement

గతంలో వచ్చిన సినిమాకు ఏ మాత్రం తక్కువ ఉన్నా కూడా కచ్చితంగా పుష్ప సినిమా ను జనాలు ఓ రేంజ్ లో ట్రోల్ చేసే అవకాశం ఉంది. అందుకే పార్ట్ 2 సినిమాను అత్యంత అద్భుతంగా తెరకెక్కించేందుకు దర్శకుడు సుకుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్ కాస్త ఎక్కువ సమయమే సుకుమార్‌ కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా సుకుమార్ పార్ట్‌ 2 ని కూడా సూపర్ హిట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నాడని అభిమానులు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఒక క్లైమాక్స్‌ విషయంలో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి