Home » Entertainment » Allu Arjun Trolled By Netigens
Entertainment

Allu Arjun : త‌నను విమ‌ర్శించే వారికి చెంప‌దెబ్బ కొట్టిన‌ట్టు చేసిన బ‌న్నీ.. ఇంత‌కు ఏం చేశాడంటే..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 13, 2022, 2:30 pm
Advertisement

Allu Arjun : అతి త‌క్కువ స‌మ‌యంలోనే పాన్ ఇండియా స్టార్ పొందిన న‌టుడు అల్లు అర్జున్. చిరంజీవిని ఇన్సిపిరేష‌న్ తీసుకొని సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా బ‌న్నీ క్రేజ్‌ని అమాంతం పెంచేసింది. దేశ విదేశాల‌లో అత‌ని ఫ్యాన్ ఫాలోయింగ్ పుష్ప సినిమాతో రెట్టింపు అయింది. ప్ర‌స్తుతం బ‌న్నీ చేస్తున్న పుష్ప 2 కూడా హిట్ అయితే ఆయ‌న రేంజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం అని అంటున్నారు. అయితే బ‌న్నీ క్రేజ్ గురించి ప‌క్క‌న పెడితే కొన్ని సంద‌ర్భాల‌లో అత‌ని ప్ర‌వ‌ర్త‌న చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. బ‌న్నీ వ్య‌వ‌హార శైలి వ‌ల‌న కొంద‌రు అత‌న‌ని తగ ట్రోల్స్ చేస్తుంటారు.

Advertisement

రీసెంట్‌గా కృష్ణం రాజు మృతి చెంద‌గా, ఆయ‌నకు సంతాపం తెలియ‌జేస్తూ ఎలాంటి ట్వీట్ చేయ‌క‌పోవ‌డంతో కొంద‌రు అత‌నిని తెగ ట్రోల్స్ చేశారు. కృష్ణ – చిరంజీవి – మోహన్ బాబు – మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ వంటి స్టార్స్ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించడమే కాదు.. జూబ్లీ హిల్స్ లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం కృష్ణంరాజు మరణంపై ట్వీట్ చేయకుండా.. తనకు సైమా అవార్డ్ దక్కడం పై పోస్ట్ పెట్టడంపై ట్రోల్స్ వచ్చాయి. రియల్ లైఫ్ లో ప్రభాస్ మరియు బన్నీ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. అలాంటిది ఆయన పెదనాన్న మృతిపై సంతాపం ప్రకటించకుండా.. తన అవార్డ్ గురించి పేర్కొందమేంటని ఓ వర్గం నెటిజన్లు అల్లు అర్జున్ పై మండిపడ్డారు.

Allu Arjun trolled by netigens

Advertisement

Allu Arjun : మంచి కౌంట‌ర్ ఇచ్చాడు..!

బ‌న్నీ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నప్ప‌టికీ ఆయ‌న అవేమి ప‌ట్టించుకోలేదు. సైమా వేడుక పూర్తైన వెంట‌నే హైద‌రాబాద్ వ‌చ్చిన బ‌న్నీ డైరెక్ట్‌గా హైదరాబాద్ కు వచ్చి నేరుగా ప్రముఖ నటుడి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు . కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. కఠిన సమయంలోనూ తన స్నేహితుడు ప్రభాస్ మొహంలో నవ్వు కనిపించేలా చేసాడు. దీంతో విమర్శించిన నెటిజన్ల నోళ్లన్నీ మూతపడ్డాయి. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న ఎలాంటి ట్వీట్ పెట్ట‌క‌పోవ‌డంతో విమ‌ర్శ‌కులు రెచ్చిపోయారు.వాటిపై బ‌న్నీ ఏమాత్రం స్పందించ‌లేదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి