Allu Arun : అట్ట‌హాసంగా పుష్ప2 పూజా కార్య‌క్ర‌మాలు.. బ‌న్నీ డుమ్మా ఎందుకు కొట్టాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arun : అట్ట‌హాసంగా పుష్ప2 పూజా కార్య‌క్ర‌మాలు.. బ‌న్నీ డుమ్మా ఎందుకు కొట్టాడు?

Allu Arun : మొన్నటి వ‌ర‌కు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా బన్నీకి ఎంతో పేరు ప్ర‌ఖ్యాతలు తెచ్చి పెట్టాయి. ర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు ఓ రేంజ్‌లో స్వాగ్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని అంద‌రు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 August 2022,3:20 pm

Allu Arun : మొన్నటి వ‌ర‌కు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా బన్నీకి ఎంతో పేరు ప్ర‌ఖ్యాతలు తెచ్చి పెట్టాయి. ర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు ఓ రేంజ్‌లో స్వాగ్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి నేడు(సోమవారం)పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ కనిపించలేదు.

Allu Arun : పుష్ప 2 మొద‌లు..

అందుకు కార‌ణం ఆయ‌న న్యూయార్క్‌లో ఉండ‌డం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. యూఎస్ఏలోని న్యూయార్క్ లో ప్రతి సంవత్సరం నిర్వహించే ‘ఇండియా డే’ పరేడ్ కు ఈ ఏడాదికి యావత్ భారత్ దేశానికి ప్రతినిథ్యం వహిస్తూ గ్రాండ్ మార్షల్ హోదాలో అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈసారి 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో గ్రాండ్ గా కావాతు నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీకి న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఘన స్వాగతం పకలికారు.

Allu Arun Did Not Attend Pushpa 2 Pooja Ceremony

Allu Arun Did Not Attend Pushpa 2 Pooja Ceremony

అలాగే ఈ పరేడ్ కు దాదాపు ఐదు లక్షల మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, ఐకాన్ స్టార్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ స్థాయిలో న్యూయర్క్ డే పరేడ్ కు ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.ఇక పుష్ప 2 విష‌యానికి వ‌స్తే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నానే హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఆమె పాత్ర నిడివి తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది