Rashmi Gautam : ఆరంతస్థుల భవనం నుంచి పడిపోయింది.. యాంకర్ రష్మీ ఆవేదన | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : ఆరంతస్థుల భవనం నుంచి పడిపోయింది.. యాంకర్ రష్మీ ఆవేదన

Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam మూగ జీవాల కోసం ఎంతలా పాటు పడుతుందో అందరికీ తెలిసిందే. ఎక్కడ ఏ వీధి కుక్కకు ఏమైనా కూడా స్పందిస్తుంటుంది. అలాంటి రష్మీ మూగ జీవాల కోసం ఎక్కువగా సహాయ కార్యక్రమాలు చేస్తుంటుంది. తాజాగా ఇషాన్ అనే కుక్క ఆరంతస్థుల భవనం నుంచి కిందపడిందట. దాన్ని నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఇంకా సమస్య కొలిక్కి రాలేదట. ఆపరేషన్ చేయాలి, ఇంటెన్సివ్ కేర్‌లో ఉంటాలని రష్మీ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :18 August 2021,6:30 am

Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam మూగ జీవాల కోసం ఎంతలా పాటు పడుతుందో అందరికీ తెలిసిందే. ఎక్కడ ఏ వీధి కుక్కకు ఏమైనా కూడా స్పందిస్తుంటుంది. అలాంటి రష్మీ మూగ జీవాల కోసం ఎక్కువగా సహాయ కార్యక్రమాలు చేస్తుంటుంది. తాజాగా ఇషాన్ అనే కుక్క ఆరంతస్థుల భవనం నుంచి కిందపడిందట. దాన్ని నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఇంకా సమస్య కొలిక్కి రాలేదట. ఆపరేషన్ చేయాలి, ఇంటెన్సివ్ కేర్‌లో ఉంటాలని రష్మీ చెబుతోంది.

Anchor Rashmi Gautam About Pet Ishaan

Anchor Rashmi Gautam About Pet Ishaan

ఆరంతస్థుల భవనం నుంచి పడిపోయింది.. యాంకర్ రష్మీ ఆవేదన Rashmi Gautam

దాని కోసం రోజువారి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయట. ఇక మందుల కోసం కూడా ఖర్చులు భారీగా అవుతున్నాయట. అయితే ఆ కుక్కను రెస్క్యూ చేసిన మహిళకు అంత స్థోమత లేదని, తన వద్దకు వచ్చి సాయం కోరిందని రష్మీ చెప్పుకొచ్చింది. తన వంతు సాయం తాను చేస్తున్నానని రష్మీ Rashmi Gautam తెలిపింది. మీరు (ఫాలోవర్స్) మీకు చేతనైన సాయాన్ని చేయండని తన అభిమానులను రష్మీ వేడుకుంది. పది లక్షలు ఒక్కరే ఇవ్వడం వేరు. పది లక్షల మంది ఒక్కో రూపాయి ఇవ్వడం వేరని తెలిపింది.

Rashmi Gautam

Rashmi Gautam

3.5 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రూపాయి ఇచ్చినా చాలని అంది. ఇషాన్ అనే ఈ కుక్కను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అది మంచిగా అయి తిరిగి బయటకు వచ్చి.. దాని కాళ్ల మీద అది నిలబడితే మళ్లీ రోడ్డు మీద వదిలే సమస్యే లేదు. దాన్ని కచ్చితంగా దత్తత తీసుకుంటాను. ఇంత చేశాక దాన్ని రోడ్డు మీద వదిలేయలేమని రష్మీ Rashmi Gautam చెప్పుకొచ్చింది. ఇదంతా చెప్పేందుకు నిన్న సడెన్‌గా లైవ్‌లోకి రష్మీ వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది