Anchor Varshini : చిన్నప్పుడే ఆ రోగం.. అసలు గుట్టు విప్పిన యాంకర్ వర్షిణి
Anchor Varshini శేఖర్ మాస్టర్ గత కొన్ని రోజులుగా తన ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుస్తున్నాడు. తన కొలిగ్స్, తన పరిచయాలను ఉపయోగించుకుంటూ నిర్మాతగా మొదటి ప్రాజెక్ట్ టెర్రస్ను సక్సెస్ చేయాలని అనుకుంటున్నాడు. తన యూట్యూబ్ చానెల్ శేఖర్ స్టూడియోస్లో రాబోతోన్న టెర్రస్ సినిమా కోసం ఢీ మెంబర్స్ అందరినీ రంగంలోకి దించుతున్నాడు. ఆది, ప్రియమణి, పూర్ణ, గెటప్ శ్రీను ఇలా అందరినీ ప్రమోషన్కు వాడుతున్నాడు.
Anchor Varshini About Sekhar Master
శేఖర్ మాస్టర్ కోసం వర్షిణి Anchor Varshini
వారి వారి టెర్రస్ కథలను చెబుతున్నారు. చిన్నతనంలో ఎవరికైనా సరే టెర్రస్ గుర్తులు ఉంటాయి. అమ్మాయిలకు లైన్లు వేయడం, అబ్బాయిలను కొంటెచూపులు చూడటం వంటివి ఉంటాయి. అలా తాజాగా వర్షిణి కూడా తన లైఫ్లోని టెర్రస్ కథను చెప్పేసింది. కానీ అందరూ అనుకున్నట్టుగా లవ్ స్టోరీ అయితే కాదు. తన అన్న ఎంతో స్ట్రిక్ట్ అన్నది అందరికీ తెలిసిందే. ఎవ్వరైనా తన అక్క, చెల్లి జోలికి వస్తే కొట్టేసి వచ్చేవాడట. ఎప్పుడూ కూడా కర్ర చేతిలో పెట్టుకునేవాడట. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పేసింది.
Anchor Varshini Gets Love letters And Gifts
ఇక తన టెర్రస్ కథ చెబుతూ.. ప్రేమ కథలు ఏవీ లేవు గానీ వర్షం పడ్డప్పుడల్లా.. నేను, అక్కా ఇద్దరంకూడా అమ్మ చీరకట్టుకుని టెర్రస్ మీదకు వెళ్లి డ్యాన్సులు చేసేవాళ్లం. మమ్మల్ని చూసి పక్కింటి అమ్మాయిలు కూడా వచ్చేవారు. పోటీ పెట్టుకుని మరీ డ్యాన్సులు వేసేవాళ్లం. అలా చేయడం వల్ల చిన్నప్పుడే నాకు ఆస్తమా వచ్చేసింది. ఇక అప్పటి నుంచి అంతగా వర్షంలో డ్యాన్సులు వేయ లేదు అని అంది. శేఖర్ మాస్టర్ టెర్రస్ సినిమాకు వర్షిణి ఆల్ ది బెస్ట్ చెప్పింది.
