
Bigg Boss 5 Telugu finale promo creates hype on episode
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ ఎవరో తేలడానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఏపిసోడ్ ను తిలకించడానికి బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నేడు సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కాబోతున్న ఈ భారీ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రోమో రీలిజ్ అయిన కాసేపటికే 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుని పూర్తి ఏపిసోడ్ పై భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రోమో ఇంతలా హైలేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటంటే… షోకు హాజరు కాబోతున్న పలువురు ప్రముఖ స్టార్లు నేడు ఒకే వేదికపై సందడి చేస్తుండటమే. మాజీ కంటెస్టెంట్లతో పాటు టాలీవుడ్ మాత్రమే కాక బాలీవుడ్ నుంచి సైతం అతిథులు హాజరవుతుండగా… ఓ కంటెస్టెంట్ మాత్రం ప్రోమోలో మిస్స్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళితో ఎంట్రి ఇచ్చిన నాగ్… ప్రోమో నిండా గెస్టులతో షోకు భారీ హైప్ తీసుకొచ్చారు. బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్లో భాగంగా బాలీవుడ్ రణబీర్, నటి అలియాభట్లు షో లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు.. నటుడు జగపతిబాబుతో పాటు నటి శ్రేయ, పలువురు ఐటమ్ తారలు, సింగర్ రాహుల్ సిప్లి గంజ్ నాటు నాటు సాంగ్ తో రచ్చ చేస్తూ ప్రోమోలో కనిపించారు. అనంతరం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పుష్ప బృందం… సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మికతో నాగ్ తో పాటు కంటెస్టెంట్లతో కలిసి కాసేపు హాంగామా చేశారు. ఇక చివరగా శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా.. నానీ, సాయి పల్లవి, కృతి శెట్టి కూడా బిగ్ బాస్ హౌస్లోపలికి వెళ్లి సందడి చేశారు.
Bigg Boss 5 Telugu finale promo creates hype on episode
అయితే షో నుంచి ఎలిమినేట్ అవుతూ వచ్చిన మాజీ ఇంటి సభ్యులంతా ప్రోమోలో కనిపించగా… ఒక్క సరయు మాత్రం కనిపించకపోవడం గమనార్హం. ఈ సీజన్లో మొదటి ఎలిమినేషన్లో భాగంగా హౌస్ నుంచి నిష్క్రమించిన సరయు.. గైర్హాజరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ టీం పై కోపంతో రాలేదని కొంతమంది అంటూ ఉండగా… ప్రోమో షూట్ అప్పటికీ తను హాజరు కాలేకపోయి ఉండవచ్చునని లేదా మరేదో బిజీ షెడ్యుల్ కారణంగా రాలేకపోయి ఉండవచ్చునని అంటున్నారు. అయితే నాలుగో సీజన్ లో ప్రోమోలో కూడా న్యూస్ రీడర్ దేవి నాగవల్లి ఇలాగే ప్రోమోలో మిస్ అవ్వగా.. ఎపిసోడ్లో మాత్రం కనిపించి షాక్ ఇచ్చింది. ఈసారి సరయు కూడా ఇలాగే ఝలక్ ఇవ్వనుందా.. లేక మొదటి సీజన్ లో ముమైత్ ఖాన్ మాదిరి షోకు గైర్హాజరు కానుందా అనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సన్నీ విజేతగా నిలుస్తున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తుండగా.. అసలు విజేత ఎవరో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి.
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
This website uses cookies.