Janhvi kapoor : జాన్వీ కపూర్ బాలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్. డెబ్యూ సినిమా దడక్ తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ తండ్రి ప్రముఖ నిర్మాత బోనీకపూర్ అలాగే మరో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ల సపోర్ట్తో బాగానే పాపులారిటీ తెచ్చుకుంది. అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా Janhvi kapoor ఎంట్రీ ఈజీ అయినా కూడా నార్త్లో తన సొంత టాలెంట్తో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ ఎదైనా బాలీవుడ్లో మొదలవుతుంటే ముందు జాన్వీ కపూర్ పేరే వినిపిస్తోంది. అంతగా తన పర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేస్తోంది.
అయితే గత రెండేళ్ళుగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ఇటు టాలీవుడ్ మీడియా అటు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అందుకు సమయం మాత్రం రావడం లేదు. ఇంతక ముందే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన నటించే అవకాశం వచ్చిందని తారక్ ద్వారా జాన్వీ కపూర్ ఎంట్రీ ఉంటుందని మాటలు వినిపించాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాతో అనన్య పాండే ఎంట్రీ ఇస్తోంది.
అయితే ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో దిల్ రాజుతో కలిసి టాలీవుడ్లో మంచి హిట్ అందుకున్న బోనీకపూర్ నెక్స్ట్ స్టెప్ కూతురు జాన్వీ కపూర్ను నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడట. అవసరమైతే తనే నిర్మాతగా టాలీవుడ్లో సినిమా ప్లాన్ చేసి దాని ద్వారా జాన్వీ కపూర్ను తీసుకు రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బోనీకపూర్ తలుచుకుంటే ఇది పెద్ద విషయమేమీ కాదు. సో గ్యారెంటీగా ఈ ఏడాది గానీ వచ్చే ఏడాది గానీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉండటం ఖాయమని అంటున్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.