Rashmika Mandanna : ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు చెడు వీడియోలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆ టెక్నాలజీనే ఉపయోగించి రష్మిక ఫేస్ ని మార్ఫింగ్ చేసి ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. బ్రిటిష్ ఇండియన్ అమ్మాయి అయినా జరా పటేల్ వీడియోకు రష్మిక ఫేస్ ని పెట్టి వీడియోని క్రియేట్ చేయగా, అది ఇప్పుడు దేశం వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇలాంటి ఫేక్ వీడియోలు ఏఐ వీడియోలను కట్టడీ చేయాలని సోషల్ మీడియాలో మారూమ్రోగిపోతుంది. ఈ వీడియో పై రష్మిక మందన స్పందించారు.
ఈ వీడియో తనను చాలా బాధించిందని, అదే ఒకవేళ స్కూల్ ఏజ్ లో ఉంటే ఏమయ్యేదాన్నో అంటూ బాధను వ్యక్తపరిచారు. ఇప్పటికే ఈ వీడియో పై చాలామంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. బిగ్ బి అమితాబచ్చన్ ఇలాంటి వీడియోలు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ వీడియో పై నాగచైతన్య, సాయి ధరంతేజ్, మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఇలాంటి వీడియోలు చూస్తే చాలా బాధగా ఉంది. టెక్నాలజీని చెడుగా వాడుకోవడం చాలా బాధాకరం. ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను తీసుకువస్తుందో. తలచుకుంటేనే భయంగా ఉంది. ఇలాంటి పనులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని నాగచైతన్య ట్వీట్ వేశారు.
సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ ఎంతో బాధగా, సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఇంత గొప్ప టెక్నాలజీని చెడుగా వాడటం, దాని వలన బాధితులు ఎంత నరకాన్ని అనుభవిస్తారో తలుచుకుంటేనే బాధేస్తుంది. దీనివలన భవిష్యత్తులో భయంకర పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించి కొత్త చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ ఇలాంటి పనులు చేసే వారిని తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. వారిలో కొంచెం కూడా మంచితనం లేదనిపిస్తుంది. ఇలాంటి వాటి మీద మాట్లాడకుండా చాలామంది సైలెంట్ గా ఉంటారు. అమ్మాయి శరీరాన్ని ఇష్టమొచ్చినట్లుగా మార్ఫింగ్ చేస్తుంటారు. ఈ సమాజం ఎటు పోతుందో. సెలబ్రిటీలు అయినందుకు మీరు ఇలా చేస్తారా. ఇదే టైం అందరూ దీనిపై నోరు విప్పండి, ప్రశ్నించండి అంటూ మృణాల్ పోస్ట్ చేశారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.