
chiranjeevi sridevi movie stopped due to this reason
Chiranjeevi- Sridevi : సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవికి ప్రత్యేకమైన స్థానం ఉందనే సంగతి తెలిసిందే. వారిద్దరికి మంచి స్టార్డం ఉండగా, ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమనే అభిప్రాయం అందరిలో ఉండేది. స్టార్ హీరోలు సైతం శ్రీదేవి తమ సినిమాల్లో కచ్చితంగా ఉండాలని రికమండే చేసి మరి దర్శకులపై ఒత్తిడి చేసేవారు. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్ – ఏఎన్నార్ – సూపర్ స్టార్ కృష్ణ, చంద్రమోహన్, కృష్ణంరాజు ఇలా అందరితోనూ శ్రీదేవి నటించిన సూపర్ హిట్లు కోట్టారు.
తర్వాత తరం హీరోలుగా అయిన చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ పక్కన కూడా శ్రీదేవి జత కట్టింది శ్రీదేవి బాలీవుడ్ లోకి ఎంటర్ అయిందో అక్కడ నుంచి ఆమె రేంజ్ పెరిగింది. బాలీవుడ్లోకి వెళ్ళాక శ్రీదేవి దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఈ అమ్మడు అంతగా ఆసక్తి చూపించలేదు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేసే క్రమంలో ఆమెకు ఇగో సమస్య అడ్డు వచ్చిందట. ఇది శ్రీదేవి సొంత సినిమా కాగా, తన తల్లిని నిర్మాతగా పెట్టి శ్రీలత మూవీస్ బ్యానర్ పై కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని డిసైడ్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి హీరో. కాగా, యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. అయితే ఈ సినిమా కోసం యండమూరి 20 కథలు అందించారట.
chiranjeevi sridevi movie stopped due to this reason
ఒక దాంట్లో హీరో డామినేట్ చేస్తే మరో దాంట్లో హీరోయిన్ డామినేట్ చేసేది. చివరకు 20 కథలు విన్నాక కూడా చిరు, శ్రీదేవి కథను ఫైనలైజ్ చేయకపోగా, ఆ సినిమా అలానే ఆగింది. వజ్రాల దొంగ అనే టైటిల్ కూడా సినిమాకి ఫిక్స్ చేశారు. కాగా అప్పట్లో శ్రీదేవి కథలో మార్పులు చేయాలని చెప్పారట. హీరో రేంజ్ లోనే తన పాత్ర కూడా ఉండాలని చెప్పడంతో పాటు టైటిల్ కార్డ్ లో హీరో పక్కనే తన పేరును కూడా వేయాలని డిమాండ్ చేసేవారట. దాంతో మేకర్స్ సినిమాలో శ్రీదేవి స్థానంలో రాధను హీరోయిన్ గా తీసుకోగా, అలా తెరెక్కిన కొండవీటి దొంగ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత విజయం సాధించిందో మనం చూశాం. చిరు శ్రీదేవి కాంబోలో మోసగాడు, రాణికాసుల రంగమ్మ , జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు వచ్చాయి.
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
This website uses cookies.