
cpi leader narayana reacts on bigg boss winner pallavi prashanth
CPI Narayana : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ గురించే చర్చ. బిగ్ బాస్ విన్నర్ కాకముందు ప్రశాంత్ గురించి ఎంత చర్చించారో అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఆయన గురించి జనాలు చర్చిస్తున్నారు. దానికి కారణం.. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక బయటికి వచ్చి చేసిన పిచ్చి పని వల్ల. లక్షలాది మంది జనాలు వచ్చారు.. అక్కడ ఉండొద్దు.. ర్యాలీ గట్రా చేయొద్దు.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఓవైపు బిగ్ బాస్ యాజమాన్యం చెప్పినా వినలేదు.. చివరకు పోలీసులు చెప్పినా పల్లవి ప్రశాంత్ వినలేదు. దాని వల్ల పల్లవి ప్రశాంత్ మీద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అయితే.. ఈ ఘటనపై తాజాగా సీపీఐ నారాయణ స్పందించారు. బిగ్ బాస్ రియాల్టీ షో పేదవాళ్లకు ఎంతో అన్యాయం చేస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులపై కేసు పెట్టాలి లేదంటే నాగార్జునపై పెట్టాలి కానీ రైతు బిడ్డ పై ఎందుకు కేసు పెట్టారు అని నారాయణ ప్రశ్నించారు.
పేద వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ను కావాలని తీసుకెళ్లి అందులో పెట్టి.. ప్రైజ్ ఇచ్చారు. ఇదంతా కావాలని చేసిందే. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులను మభ్యపెట్టేందుకు ఇదంతా చేస్తున్నారు. బయటికి వచ్చాక పిల్లలు కొట్లాడుకుంటే ప్రశాంత్ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. పోలీసులు బిగ్ బాస్ కు ఏజెంట్ గా పని చేస్తున్నారా? బిగ్ బాస్ మేనేజ్ మెంట్, బిగ్ బాస్ హోస్ట్ మీద కేసులు పెట్టాలి. ప్రశాంత్ మీద పెట్టిన కేసులన్నీ పోలీసులు వెంటనే ఉపసంహరించుకోవాలి అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై తెలంగాణ చీఫ్ జస్టిస్ కు సీపీఐ నారాయణ లేఖ కూడా రాశారు. ఆయన వారంలో దీనిపై విచారణ చేస్తామన్నారు. లేదంటే పిల్ కూడా వేస్తాం. బిగ్ బాస్ దురాగతాలకు ఒక రైతు బిడ్డ అన్యాయం అయ్యాడు. దీన్ని అందరూ కలిసి ఖండించాలి. బిగ్ బాస్ మీద ఫైట్ చేసి రద్దు చేసేవరకు కొట్లాడుతా అని సీపీఐ నారాయణ స్పష్టం చేశారు.
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
Social Media Ban for Children : ఏపీ ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై…
This website uses cookies.