
sajjala ramakrishna reddy comments on nara lokesh and pawan kalyan
Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు వ్యూహాలు రచించే పనిలో బిజీ అయ్యాయి. ఇటీవలే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సభపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. వాళ్లు ఎప్పుడు పవర్ లోకి రావాలి అనేదే ఉంది. వేల కిలోమీటర్లు నారా లోకేష్ నడిచాడా? వీళ్లు ముగ్గురు మాట్లాడిన దాన్ని గమనిస్తే ఎంత త్వరగా పవర్ లోకి రావాలనేదే వాళ్లలో కనిపిస్తోంది. మళ్లీ ప్రజల్లో విశ్వాసం తెచ్చుకోవడం కోసం పడే ఆత్రం వాళ్లలో కనిపిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్లంతా ఒక మాండేట్ ఇచ్చారు.
వీళ్ల మైత్రి కలకాలం కొనసాగాలట. అధిష్ఠానం మాటకు అందరూ కట్టుబడి ఉండాలట. కేవలం ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ పక్కన లేకపోతే జనం దృష్టిలో వాల్యూ లేదని చంద్రబాబుకు తెలుసు. ఆయన రాకుంటే ఇంటికి వెళ్లి కాళ్లా వేళ్లా పడి సభకు తీసుకొచ్చుకున్నాడన్నారు. ఒకపక్క డెస్పరేషన్, మరో పక్క మేమంతా కలిశాం అనేది చెప్పుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అది. నిజంగా అదే కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి వాళ్లకు మాట్లాడే అర్హత లేదు. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్లు ఏం చేశారో తెలుసుకోవడం లేదు.
2014 నుంచి 2019 వరకు ఈ పెద్దమనిషి ఏం చేశాడో ఎందుకు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు దాని గురించి ప్రస్తావించడం లేదు. ఒక కొత్త పార్టీ పెడితే ఏ నాయకుడు అయినా ఎలా హామీలు గుప్పిస్తారో అలా హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలు అడగరా? 2014 లో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే గెలిచారు. మరి 2019 లో ఎందుకు పవన్.. చంద్రబాబుతో వ్యతిరేకించారు అంటూ సజ్జల ప్రశ్నించారు.
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
This website uses cookies.