sajjala ramakrishna reddy comments on nara lokesh and pawan kalyan
Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు వ్యూహాలు రచించే పనిలో బిజీ అయ్యాయి. ఇటీవలే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సభపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. వాళ్లు ఎప్పుడు పవర్ లోకి రావాలి అనేదే ఉంది. వేల కిలోమీటర్లు నారా లోకేష్ నడిచాడా? వీళ్లు ముగ్గురు మాట్లాడిన దాన్ని గమనిస్తే ఎంత త్వరగా పవర్ లోకి రావాలనేదే వాళ్లలో కనిపిస్తోంది. మళ్లీ ప్రజల్లో విశ్వాసం తెచ్చుకోవడం కోసం పడే ఆత్రం వాళ్లలో కనిపిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్లంతా ఒక మాండేట్ ఇచ్చారు.
వీళ్ల మైత్రి కలకాలం కొనసాగాలట. అధిష్ఠానం మాటకు అందరూ కట్టుబడి ఉండాలట. కేవలం ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ పక్కన లేకపోతే జనం దృష్టిలో వాల్యూ లేదని చంద్రబాబుకు తెలుసు. ఆయన రాకుంటే ఇంటికి వెళ్లి కాళ్లా వేళ్లా పడి సభకు తీసుకొచ్చుకున్నాడన్నారు. ఒకపక్క డెస్పరేషన్, మరో పక్క మేమంతా కలిశాం అనేది చెప్పుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అది. నిజంగా అదే కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి వాళ్లకు మాట్లాడే అర్హత లేదు. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్లు ఏం చేశారో తెలుసుకోవడం లేదు.
2014 నుంచి 2019 వరకు ఈ పెద్దమనిషి ఏం చేశాడో ఎందుకు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు దాని గురించి ప్రస్తావించడం లేదు. ఒక కొత్త పార్టీ పెడితే ఏ నాయకుడు అయినా ఎలా హామీలు గుప్పిస్తారో అలా హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలు అడగరా? 2014 లో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే గెలిచారు. మరి 2019 లో ఎందుకు పవన్.. చంద్రబాబుతో వ్యతిరేకించారు అంటూ సజ్జల ప్రశ్నించారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.