Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు వ్యూహాలు రచించే పనిలో బిజీ అయ్యాయి. ఇటీవలే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సభపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. వాళ్లు ఎప్పుడు పవర్ లోకి రావాలి అనేదే ఉంది. వేల కిలోమీటర్లు నారా లోకేష్ నడిచాడా? వీళ్లు ముగ్గురు మాట్లాడిన దాన్ని గమనిస్తే ఎంత త్వరగా పవర్ లోకి రావాలనేదే వాళ్లలో కనిపిస్తోంది. మళ్లీ ప్రజల్లో విశ్వాసం తెచ్చుకోవడం కోసం పడే ఆత్రం వాళ్లలో కనిపిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్లంతా ఒక మాండేట్ ఇచ్చారు.
వీళ్ల మైత్రి కలకాలం కొనసాగాలట. అధిష్ఠానం మాటకు అందరూ కట్టుబడి ఉండాలట. కేవలం ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ పక్కన లేకపోతే జనం దృష్టిలో వాల్యూ లేదని చంద్రబాబుకు తెలుసు. ఆయన రాకుంటే ఇంటికి వెళ్లి కాళ్లా వేళ్లా పడి సభకు తీసుకొచ్చుకున్నాడన్నారు. ఒకపక్క డెస్పరేషన్, మరో పక్క మేమంతా కలిశాం అనేది చెప్పుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అది. నిజంగా అదే కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి వాళ్లకు మాట్లాడే అర్హత లేదు. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్లు ఏం చేశారో తెలుసుకోవడం లేదు.
2014 నుంచి 2019 వరకు ఈ పెద్దమనిషి ఏం చేశాడో ఎందుకు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు దాని గురించి ప్రస్తావించడం లేదు. ఒక కొత్త పార్టీ పెడితే ఏ నాయకుడు అయినా ఎలా హామీలు గుప్పిస్తారో అలా హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలు అడగరా? 2014 లో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే గెలిచారు. మరి 2019 లో ఎందుకు పవన్.. చంద్రబాబుతో వ్యతిరేకించారు అంటూ సజ్జల ప్రశ్నించారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.