
sajjala ramakrishna reddy comments on nara lokesh and pawan kalyan
Sajjala Ramakrishna Reddy : ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు వ్యూహాలు రచించే పనిలో బిజీ అయ్యాయి. ఇటీవలే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సభపై తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. వాళ్లు ఎప్పుడు పవర్ లోకి రావాలి అనేదే ఉంది. వేల కిలోమీటర్లు నారా లోకేష్ నడిచాడా? వీళ్లు ముగ్గురు మాట్లాడిన దాన్ని గమనిస్తే ఎంత త్వరగా పవర్ లోకి రావాలనేదే వాళ్లలో కనిపిస్తోంది. మళ్లీ ప్రజల్లో విశ్వాసం తెచ్చుకోవడం కోసం పడే ఆత్రం వాళ్లలో కనిపిస్తోంది. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్లంతా ఒక మాండేట్ ఇచ్చారు.
వీళ్ల మైత్రి కలకాలం కొనసాగాలట. అధిష్ఠానం మాటకు అందరూ కట్టుబడి ఉండాలట. కేవలం ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ పక్కన లేకపోతే జనం దృష్టిలో వాల్యూ లేదని చంద్రబాబుకు తెలుసు. ఆయన రాకుంటే ఇంటికి వెళ్లి కాళ్లా వేళ్లా పడి సభకు తీసుకొచ్చుకున్నాడన్నారు. ఒకపక్క డెస్పరేషన్, మరో పక్క మేమంతా కలిశాం అనేది చెప్పుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అది. నిజంగా అదే కనిపిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి వాళ్లకు మాట్లాడే అర్హత లేదు. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్లు ఏం చేశారో తెలుసుకోవడం లేదు.
2014 నుంచి 2019 వరకు ఈ పెద్దమనిషి ఏం చేశాడో ఎందుకు చెప్పలేకపోతున్నాడు. ఎందుకు దాని గురించి ప్రస్తావించడం లేదు. ఒక కొత్త పార్టీ పెడితే ఏ నాయకుడు అయినా ఎలా హామీలు గుప్పిస్తారో అలా హామీలు గుప్పిస్తున్నారు. ప్రజలు అడగరా? 2014 లో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే గెలిచారు. మరి 2019 లో ఎందుకు పవన్.. చంద్రబాబుతో వ్యతిరేకించారు అంటూ సజ్జల ప్రశ్నించారు.
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
This website uses cookies.