Aishwarya meeting Dhanush real Here is the clarity
Dhanush Aishwarya :18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ధనుష్ ఐశ్వర్య జంట ఇటీవల విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నఈ జంట ఇప్పుడు విడిపోతున్నట్లు ప్రకటించడంతో ఈ వ్యవహారం వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చింది. ధనుష్ కస్తూరిరాజా కుమారుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కి విడుదలైన ‘కాదల్ కొండెన్’ అనే సినిమా కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
గత కొద్ది రోజులుగా ధనుష్ ఐశ్వర్య విడాకుల విషయం జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ డివోర్స్కి కారణాలేంటి? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు విడిపోతున్నారనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ తండ్రి కస్తూరి రాజా రియాక్ట్ అయ్యారు. ఓ కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కస్తూరి రాజా. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సాధారణమైన విషయం. అలాంటి మనస్పర్థలే ధనుష్, ఐశ్వర్య మధ్య చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్లో ఉన్నారని అన్నాడు.
dhanush Aishwarya father gives good news to fans
విడాకుల విషయం గురించి ఇద్దరితో చర్చించాను. నా వంతు సూచనలు ఇచ్చాను. రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయంపై మరోసారి ఆలోచించమని వారిద్దరిని కోరారు. మరోవైపు పిల్లల భవిష్యత్తు కోసం విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు కోరుతున్నారని కస్తూరి రాజా అన్నారు.కాగా 2004లో పెద్దల అనుమతితో ఏడడుగులు నడిచిన ధనుష్, ఐశ్వర్యలకు లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులున్నారు. ఈక్రమంలో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ లవ్లీ కపుల్ హఠాత్తుగా బ్రేకప్ చెప్పేసి అభిమానులతో పాటు సినీ ప్రియులకు షాక్ ఇచ్చారు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.