Anchor Pradeep also leaving etv Dhee Show
Dhee Show : ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ఢీ కి ఆదరణ తక్కువ అయింది. గత నాలుగైదు సీజన్లకు రష్మీ సుధీర్ టీం లీడర్ గా వ్యవహరిస్తు ఉండగా ఆది కూడా వారితో జాయిన్ అవ్వడంతో షో కు మంచి రేటింగ్ దక్కేది. ఎప్పటిలాగే ప్రదీప్ తనదైన శైలిలో ఆకట్టుకుంటూ మంచి జోష్ తో ఢీ షో ని ముందుకు తీసుకెళ్ళే వాడు. కానీ అనూహ్యంగా ఈ సీజన్ నుండి సుధీర్ ని మరియు రష్మిని తొలగించడంతో మొత్తం రేటింగ్ తారుమారు అయింది.గత అయిదేళ్లలో ఎప్పుడూ లేనంత దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది అంటూ స్వయంగా ఈ టీవీ కి సంబంధించిన వారే వెల్లడించారు.
ఒక సుదీర్ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి అంటూ వారు బలంగా నమ్ముతున్నారు. ప్రేక్షకులు మరియు బుల్లి తెర విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కానీ ఈ ఢీ షో లో మాత్రం అతని కామెడీ విరక్తి కలిగిస్తుంది అంటూ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరి ఇంత దారుణమైన కామెడీని ఈ మధ్య కాలంలో చూడలేదు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ షోలో డాన్స్ తో పాటు కామెడీని కూడా ప్రేక్షకులు కోరుకుంటారు. ఢీ షో నిర్వాహకులు ప్రేక్షకులకు అలా అలవాటు చేశారు. కనుక ఇప్పుడు కామెడీ లేకపోవడంతో లోటు క్లియర్ కనిపిస్తుంది. అందుకే దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది.
etv dance show Dhee rating very down
ప్రతి ప్రేక్షకుడు కూడా ఎప్పుడెప్పుడు ఈ సీజన్ పూర్తి అవుతుందా అంటూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కొత్త సీజన్లో అయినా సుధీర్ మరియు రష్మీ లు రీ ఎంట్రీ ఇస్తారేమో అని ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఢీ షో ను జనాలు త్వరలోనే మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇప్పుడే నిర్వాహకులు ముందు జాగ్రత్తగా పడితే బెటర్. ఇంకా ఎన్నాళ్లు ఈ ఢీ సీజన్ ను చూడాలి రా బాబు సోది అంటూ ప్రేక్షకులు అసంతృప్తితో ఉన్నారు. యాంకర్.. జడ్జి.. కంటెస్టెంట్స్.. టీమ్ లీడర్ ఇలా ప్రతి ఒక్కరి విషయంలో కూడా వ్యతిరేకత కనిపిస్తోంది.
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…
Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో…
This website uses cookies.