Game Changer : బాప్ రే.. సినిమాలోని 5 పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేశారా...!
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ Game Changer . ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అయితే రీసెంట్ గా డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘గేమ్ ఛేంజర్’పై మరింత బజ్ క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా పాటల కోసం దాదాపు 75 కోట్లను మేకర్స్ ఖర్చు చేశారన్న వార్త హైప్ గ్రాఫ్ ను భారీగా పెంచేస్తోంది. సినిమాలో మొత్తం 5 పాటలు ఉండగా, ఒక్కో పాటను అద్భుతమైన లొకేషన్స్, సెట్స్ లో… అదిరిపోయే స్టెప్పులతో, పవర్ ఫుల్ మ్యూజిక్ తో విజువల్ వండర్ గా నిర్మించినట్టు దిల్ రాజు ముంబై ప్రెస్మీట్లో తెలియజేశారు.
Game Changer : బాప్ రే.. సినిమాలోని 5 పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేశారా…!
ముందుగా ‘జరగండి’ పాట గురించి మాట్లాడుకుంటే 70 అడుగుల కొండపైనున్న ఓ పల్లెటూరులో, ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో 13 రోజుల పాటు ‘జరగండి’ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో దాదాపు 600 మంది డాన్సర్లతో 8 రోజులపాటు షూట్ చేశారు. రెండో పాట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ను ఇండియాలోని జానపద కళలకు నివాళిగా రూపొందించారు. ఇందులో 1000 కంటే ఎక్కువ మంది జానపద కళాకారులు డాన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మూడో పాట ‘నానా హైరానా’. ఈ రొమాంటిక్ పాటను ఫస్ట్ టైం ఇండియాలోనే ఇన్ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించారు. న్యూజిలాండ్ లోని అద్భుతమైన లోకేషన్లలో రామ్ చరణ్ కియారా అద్వానీపై రూపొందిన ఈ పాట బెస్ట్ మెలోడీగా రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది.
నాలుగో పాట ‘ధోప్’ విషయానికి వస్తే… ఇదో టెక్నో డాన్స్ నెంబర్. ఈ పాటను కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్ లోనే షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో దాదాపు 100 మంది ప్రొఫెషనల్ డాన్సర్లను రష్యా నుంచి రప్పించినట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్లో రామ్ చరణ్ తో పాటు కియారా కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు. చివరిగా ఐదవ పాట సర్ప్రైజ్ ప్యాకేజీ.. ఈ పాటను ప్రేక్షకులు వెండితెరపై చూసి థ్రిల్ ఫీల్ అవ్వడం ఖాయమని అంటున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. పాటలకే ఈ రేంజ్లో ఖర్చు పెడితే సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టి ఉంటారా అని అందరు ముచ్చటించుకుంటున్నారు.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.