Mahesh Babu : ఈడీ విచారణకి మహేష్ బాబు.. హాజరవుతాడా లేదా?
Mahesh Babu : ఏపీ, తెలంగాణలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య, సురానా గ్రూప్పై ఈడీ అధికారులు ఏప్రిల్ 16వ తేదీన సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ సోదాల్లో వారి కంపెనీ అకౌంట్లలో అనేక సందేహాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో మహేష్ బాబుకు చెల్లించిన కొన్ని కోట్ల రూపాయలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Mahesh Babu : అంతా సస్పెన్స్..
దాంతో మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్ కంపెనీల ప్రమోషన్ కోసం మహేశ్ బాబు రూ. 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. మహేష్ బాబుకు ఏప్రిల్ 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 28వ తేదీన విచారణకు రావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Mahesh Babu : ఈడీ విచారణకి మహేష్ బాబు.. హాజరవుతాడా లేదా?
బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో మహేష్ బాబు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్ కారణంగా తాను విచారణకు రాలేఖపోతున్నట్టు లేఖ రాసారు మహేష్ బాబు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మహేష్ బాబు తన న్యాయవాదిని ఈడీ కార్యాలయానికి పంపించనున్నారు. ఇప్పటికే మహేష్ బాబుకు రెండు సార్లు ఈడీ నోటీసులు పంపించిన విషయం తెలసిందే.