Home » Entertainment » Indraja Came Back To Sridevi Drama Company Show
Entertainment

Indraja : మళ్లీ ఎంట్రీ ఇచ్చిందిగా.. ఇక శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఇంద్రజ ఫిక్స్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 28, 2022, 11:30 am
Advertisement

Indraja : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో విపరీతంగా ప్రేక్షకాదరణ సంపాదించుకున్న వాటిలో జబర్దస్త్ కార్యక్రమం, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలు ఒకటి అని చెప్పాలి. ఈటీవీలో ముందుగా జబర్దస్త్ కార్యక్రమం ప్రసారం కాగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితలుగా నాగబాబు రోజా వ్యవహరించేవారు. అయితే రోజా అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి ఇంద్రజ న్యాయ నిర్ణయితగా వచ్చారు.అయితే తిరిగి రోజ ఈ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది.

Advertisement

ఇకపోతే రోజాకు మంత్రి పదవి రావడంతో ఈమె పూర్తిగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.రోజా జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో ఆస్థానంలో పర్మనెంట్ జడ్జిగా ఇంద్రజ స్థిరపడ్డారు. ఇలా ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి బయటకు రావడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించగా ఇక్కడ నేను కనిపించి అక్కడ కూడా నేనే కనిపడితే ప్రజలు ఛీ కొడతారు అందుకే వాళ్ళు ఛీకొట్టక ముందే నేనే బయటకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు.

Indraja Came Back To Sridevi Drama Company SHow

Advertisement

ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఈవారం బోనాల జాతర కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ విధంగా ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి రీఎంట్రీ ఇవ్వడంతో ఇకపై ఈ కార్యక్రమంలో పర్మినెంట్ గా ఉండిపోతారని అందరు భావిస్తున్నారు. మరి ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా పర్మినెంట్ జడ్జిగా ఉంటారా? లేకపోతే ఈ కార్యక్రమం నుంచి తప్పకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి