RRR Movie : ఒకప్పుడు థియేటర్స్లో 50 రోజులకి పైగా సినిమాలు ఆడేవి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంత పెద్ద సినిమా అయిన 10 రోజుల వరకే. తర్వాత కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ చివరి చిత్రం జేమ్స్.. ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లతో సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నెల 17వ తేదీన జేమ్స్ విడుదలైంది. ‘ది క శ్మీర్ ఫైల్స్ తో పాటు మరో భారీ సినిమా కోసం బెంగళూరుతో సహా రాష్ట్రంలో పలు థియేటర్ల నుంచి జేమ్స్ సినిమాను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పరభాష చిత్రాల కోసం కన్నడ చిత్రాలకు అన్యాయం చేయొద్దని పలు కన్నడపర సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
ఇప్పటికే కర్ణాటకలో ‘బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్’ అంటూ ట్రెండ్ నడుస్తుంది. కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో సినిమా కన్నడలో రిలీజ్ అవ్వట్లేదు. కొన్ని టెక్నికల్ కారణాలతో ప్రస్తుతం కర్ణాటకలో తెలుగు, హిందీ భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. దీంతో కన్నడ నాట వ్యతిరేకత ఎదురైంది. అయితే కన్నడ భాషలో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే జేమ్స్ సినిమా రిలీజ్ అయ్యాక వారం రోజుల వరకు కర్ణాటకలో వేరే సినిమా రిలీజ్ చేయకూడదని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్, సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకున్నారు. నేటితో సినిమా రిలీజ్ అయి వారం అయిపోవడంతో రేపట్నుంచి చాలా థియేటర్లలో ఈ సినిమాని తీసేసి ‘ఆర్ఆర్ఆర్’ని ప్రదర్శించనున్నారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ నటించిన జేమ్స్ సినిమాను ది కశ్మీర్ ఫైల్స్ , ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎత్తివేయడం తగదని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. బుధవారం ఆయన మైసూరులో మాట్లాడుతూ కన్నడ సంప్రదాయాలకు నిదర్శనం డాక్టర్ రాజ్కుమార్ అన్నారు. అలాంటి వ్యక్తి కుమారుడు పునీత్ అకాల మరణం తరువాత విడుదల అయిన జేమ్స్ చిత్రాన్ని పక్కన పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో కన్నడ చిత్రాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పునీత్ అభిమానులు, కర్ణాటక రాజకీయ నాయకులు పునీత్ చివరి సినిమాని అప్పుడే థియేటర్లలోంచి తీసేయొద్దు, వేరే భాష సినిమాల కోసం జేమ్స్ సినిమాను పక్కన పెట్టొద్దు అంటూ ర్యాలీలు నిర్వహిస్తూ, మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.