Janaki Kalaganaledu 21 Oct Today Episode : అసలు విషయం తెలుసుకున్న జ్ఞానాంబ.. కథలో కీలక మలుపు.. జానకి ఐపీఎస్ అయ్యేనా?
Janaki Kalaganaledu 21 Oct Today Episode : బుల్లితెరపై సందడి చేస్తోన్న సీరియల్స్లో ఒకటైన ‘జానకి కలగనలేదు’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ అయిన ఈ ‘జానకి కలగనలేదు’ సీరియల్ చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం విశేషం. ప్రతీ రోజు సీరియల్ చూసే వారు బాగా పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే రేటింగ్ మార్మోగిపోతున్నది. ఇకపోతే ‘జానకి కలగనలేదు’ లేటెస్ట్ ఎపిసోడ్లో కథలో కీలక మలుపు వచ్చేసింది. అదేంటంటే..గురువారం ఎపిసోడ్లో కథలో […]
Janaki Kalaganaledu 21 Oct Today Episode : బుల్లితెరపై సందడి చేస్తోన్న సీరియల్స్లో ఒకటైన ‘జానకి కలగనలేదు’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ అయిన ఈ ‘జానకి కలగనలేదు’ సీరియల్ చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం విశేషం. ప్రతీ రోజు సీరియల్ చూసే వారు బాగా పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే రేటింగ్ మార్మోగిపోతున్నది. ఇకపోతే ‘జానకి కలగనలేదు’ లేటెస్ట్ ఎపిసోడ్లో కథలో కీలక మలుపు వచ్చేసింది. అదేంటంటే..గురువారం ఎపిసోడ్లో కథలో కీలక మలుపు రాగా, అందుకు బుధవారం ఎపిసోడ్ లింక్ అయి ఉంది. జానకి చదువుకుంటున్న సంగతి జ్ఞానాంబకు తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే జ్ఞానాంబ ఆగ్రహం వ్యక్తం చేస్తు కోపంగా ఉండిపోతుంది.
జానకి అత్తయ్య అయిన జ్ఞానాంబ కోపాన్ని చూసి అలా కావడానికి కారణమేంటని ఆలోచిస్తుంటుంది. ఈ క్రమంలో తన డిగ్రీ సర్టిఫికెట్ కనబడుతుంది. అలా జ్ఞానాంబకు తన చదువు విషయం తెలిసిందని భయపడిపోతుంది. ఈ సంగతులు ఇలా కొనసాగుతుండగానే.. జానకి అన్నయ్య యోగిని జ్ఞానాంబ పిలిపిస్తుంది. జ్ఞానాంబ పిలుపు మేరకు జానకి అన్నయ్య యోగి అగ్రరాజ్యం అయిన అమెరికా నుంచి వెంటనే వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే జ్ఞానాంబ వద్దకు వచ్చేస్తాడు. ఆమెకు నమస్కరించి ఎందుకు పిలిపించారో అడుగుతాడు.
Janaki Kalaganaledu 21 Oct Today Episode : జానకి ఎవరి సహకారంతో చదువుకుంటున్నదో తెలుసుకున్న జ్ఞానాంబ..
అంతలోనే జ్ఞానాంబ జానకి చదువుకున్న చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను డైరెక్ట్గా యోగిపైన విసరేస్తుంది. అయితే, కొద్ది సేపటి వరకు అసలు ఆ సర్టిఫికెట్లు ఏంటో అర్థం కావు. చిరవకు అవి జానకి సర్టిఫికెట్లని గుర్తిస్తాడు. ఇంటికి వచ్చిన యోగిని చూసి రామ, గోవిందరాజు షాక్ అవుతారు. ఈ సందర్భంలో పెళ్లికి ముందర జరిగిన సంగతులను జ్ఞానాంబ గుర్తు చేస్తుంది. తన చెల్లెలు ఐదో తరగతి వరకు చదువకుందని చెప్పాడని, ఆ విషయమై తాను వంద సార్లు అడిగానని చెప్పింది జ్ఞానాంబ. తన చెల్లి చదువు విషయంలో ఎందుకు అబద్ధం చెప్పావంటూ యోగిని కాలర్ పట్టుకునే అడిగి కడిగేస్తుంది జ్ఞానాంబ. అలా అబద్ధం చేసినందుకుగాను ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండని అంటుంది.
ఆ తర్వాత క్రమంలో జానకి డిగ్రీ తర్వాత కూడా చదువు కొనసాగిస్తున్న సంగతి తెలుస్తుంది. భార్య జానకి కోసం అమ్మ జ్ఞానాంబను జానకి భర్త మోసం చేస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతుంది. మొత్తంగా భర్త సహకారంతోనే జానకి ముందుకు కొనసాగుతుందనే అసలు విషయం తెలుసుకుని జ్ఞానాంబ తెలుసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇక జానకి కథ ముగిసిందా అనేంతలా సస్పెన్స్ క్రియేట్ అయింది. జానకి ఐపీఎస్ కావాలనుకునే తన కలను సాకారం చేసుకోగలదా? అనే విషయాల కోసం నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.