
Jessie apologizes to Vishnu Mallika Janaki who wants to leave the house
Janaki Kalaganaledu : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు ఈ సీరియల్ అభిమానలని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదల కాదు. 366 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మల్లికాకు జ్ఞానాంబ పెట్టిన షరత్ తలుచుకుంటూ మండిపోతూ ఉంటుంది. కట్ చేస్తే జానకి సంతోషంగా కాలేజీకి వెళ్తూ వస్తూ తన భర్తతో సంతోషంగా గడుపుతూ ఉంటుంది. ఇదంతా చూస్తు మల్లికా.. మండిపోతు ఏదో ఒకటి చేయాలి. అని ఆలోచిస్తూ అసలు నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని అనుకుంటు.. విష్ణు దగ్గరికి వెళ్లి మనం ఎలాగైనా ఇంట్లో నుంచి వేరు కాపురం పెట్టి సిటీకి వెళ్లిపోవాలి అని చెప్తుంది. అప్పుడు విష్ణు నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటే అని అంటాడు. నువ్వు నా మాట వింటావు అని నాకు మాట ఇచ్చావు కదా.. ఇంట్లో నుంచి వెళ్లడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు.. మనిద్దరం విడాకులు తీసుకుందాం.. అని విష్ణును బెదిరిస్తుంది.
అప్పుడు విష్ణు ఎలా నే అమ్మని ఎలా అడుగుతావు అని భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు మల్లికా మనిద్దరం కలిసి వెళ్లి మీ అమ్మని మేము వేరు కాపురం పెడతాము అని చెప్పేద్దాం… అని అంటుంది. అప్పుడు విష్ణు కంగారు పడిపోతూ ఉంటాడు. ఇది ఎలా చేస్తుంది ఏందిరా దేవుడా అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే జానకి కాలేజీలో జెస్సీని కలవడానికి అఖిల్ వస్తాడు. వచ్చి జెస్సి తో మాట్లాడుతూ ఉండగా… జానకి కనిపిస్తుంది అఖిల్ కి అప్పుడు అఖిల్ భయపడిపోయి చాట్ కి వెళ్లిపోతాడు. జానకి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వస్తాడు. అప్పుడు జెస్సి అడుగుతుంది ఏమైంది అలా వెళ్ళిపోయావు అని అంటుంది. మా వదిన ఇదే కాలేజీలో చదువుతుందా నాకు తెలియదు అని కంగారు పడిపోతూ ఉంటాడు. జానకి గారు మీ వదిన అని అంటుంది. అప్పుడు జానకి గురించి అఖిల్ కి అంత చెప్తుంది. అవునా అని అఖిల్ తనతో జాగ్రత్తగా ఉండు అని జెస్సికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జెసి జానకిని కలిసి సారీ అక్క అని వరుస కలుపుతుంది. అదేంటి అక్క అని కొత్తగా పిలుస్తున్నావు అని అంటుంది. జానకి.
Jessie apologizes to Vishnu Mallika Janaki who wants to leave the house
అప్పుడు జెస్సి ఎందుకో అలా పిలవాలనిపించింది. సారీ అక్క ఇక మీద నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్ లా ఉందాము అని అంటుంది. సరే అని జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మల్లికా విష్ణు జ్ఞానంబానీ వేరు కాపురం పెట్టడానికి అడగడానికి వస్తారు. అప్పుడు జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి నువ్వు అడుగు నువ్వు అడుగు అని ఒకరికి ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు మల్లిక అత్తయ్య గారు మీరు ఇంట్లో ఒకరికి న్యాయం, ఒకరికి అన్యాయం చేస్తున్నారు అని అంటుంది. ఏంటి వింతగా మాట్లాడుతున్నావు అని జ్ఞానాంబ అంటుంది. అంటే అత్తయ్య గారు మీకు ఇష్టం లేకపోయినా జానకిని చదువుకోడానికి ఒప్పుకున్నారు. అంటే వారికి నచ్చింది. మీరు చేస్తున్నారు. మరి నాకు నచ్చింది కూడా చేయాలి కదా అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు గోవిందరాజు ఇప్పుడు నీకు నచ్చిందే చేస్తున్నావు కదా మల్లికా మా మాట ఎక్కడ వింటున్నావు. నువ్వు అని వెటకారంగా అంటాడు. ఇది వెటకారం కాదు మావయ్య గారు సీరియస్ అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
This website uses cookies.