Jr NTR : స్టార్ హీరోలకు సక్సెస్ పడిందంటే రెమ్యూనరేషన్ భారీగా పెరుగుతుంది. ఎన్టీఆర్ కి ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయం నమోదు అయిన విషయం తెలిసిందే. దాంతో ఆయన తదుపరి సినిమా కు ఏకంగా 70 నుండి 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే మార్కెట్ పెరిగింది అనడంలో సందేహం లేదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా విడుదలైన వెంటనే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే కచ్చితంగా ఆయన మార్కెట్ మరింతగా విస్తరించేది.. అలాగే రాజమౌళి సినిమా వల్ల వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకున్నట్లు అయ్యేది అంటూ టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టలేదు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఆయన సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కాకుంటే 2023 సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం దాదాపుగా లేనట్లే… అంటే ఎన్టీఆర్ సినిమా కోసం 2024 వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు ఫైనాన్సియల్ గా మాట్లాడుతూ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒక్కొక్క సినిమాకు తీసుకునే పారితోషికం భారీ మొత్తంలో ఉంటుంది..
కనుక గత ఐదు ఆరు నెలలుగా ఆయన ఖాళీగా ఉండటం వల్ల భారీ పారితోషికం ఆయన మిస్ అవుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఆయన ఒకవేళ ఇప్పటికే సినిమా చేసుకుంటే 50 నుండి 60 కోట్ల రూపాయలు ఆయన ఖాతాలో పడేవి. వెంటనే మరో సినిమాను కూడా చేసేవాడు, అలా రెండు సినిమాలతో ఆయన రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ దక్కించుకునే వాడు. కనుక కొరటాల శివ స్క్రిప్ట్ విషయం లో ఆలస్యం చేయడం వల్ల ఎన్టీఆర్ కి 100 కోట్ల నష్టం అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నష్టం ను భర్తీ చేసేది ఎవరు? అంటూ ఎన్టీఆర్ అభిమానులు దర్శకుడు కొరటాల శివ ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.