Jr Ntr : ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎన్టీఆర్ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారేంటి ?
ప్రధానాంశాలు:
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎన్టీఆర్ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారేంటి ?
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరగగా, ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

Jr Ntr : ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎన్టీఆర్ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారేంటి ?
Jr Ntr కావాలనే చేస్తున్నారా..
అయితే వారంతా పురుషులే. పైగా ఎక్కువ మంది హిందువులు. సాధారణంగా హిందూ మత ఆచారాల ప్రకారం భారత్లో మహిళలు సిందూరాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆ సిందూరాన్ని ఉగ్రవాదులు దూరం చేశారు. అందుకే ఆపరేషన్కి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు. అయితే ఓ వైపు పాక్ తో భీకర యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఎన్టీఆర్పై తెగ ట్రోల్ చేస్తున్నారు. హిందువులని టార్గెట్చేసి ముస్లింలు కాల్చి చంపారు. దాని ఎఫెక్టే ఆపరేషన్ సిందూర్.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ని మధ్యలోకి తీసుకొచ్చి ఆయన ముస్లిం అయిన కూడా పేరు మార్చుకొని జూనియర్ తారకరామారావుగా మారాడని అంటున్నారు. షాప్ నేమ్ ఒకటి, యూపీఐ ఐడి ఇంకోటి అంటూ క్రిటిసైజ్ చేస్తున్నారు. ఓ లెజెండ్ హీరో పేరుని చెడగొట్టేలా కొందరు ఇలా చేయడం దారుణం అని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.