k viswanath passed away
K Viswanath : ఇటీవల టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణంరాజ, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, దర్శకుడు సాగర్ ఇలా పలువురు ప్రముఖులు వరుసగా మృతి చెందారు. వారి మృతిని జీర్ణించుకోకముందే తాజాగా లెజండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ కన్నుమూసారు. గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. గత కొద్దీరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య సమస్య తీవ్ర కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఇండస్ట్రీకి ఏమైంది..
k viswanath passed away
విశ్వనాథ్ పూర్తి పేరు ఆయన పూర్తి పేరు కాశినాథుని విశ్వనాథ్. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించగా, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. అయితే సినిమాలపై అభిమానంతో చిత్రసీమలో అడుగుపెట్టిన విశ్వనాథ్ 1965లో దర్శకుడిగా మారి ఆత్మగౌరవం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఆయన తెరకెక్కించిన సినిమాలలో శంకరాభరణం చాలా స్పెషల్. ‘శంకరాభరణం’ 1980 ఫిబ్రవరి 2న విడుదలై మెల్లగా మౌత్ టాక్ తో మంచి పేరు సంపాదించి, ఆ యేడాది అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది. ఈ సినిమా 43ఏళ్లు పూర్తిచేసుకున్న రోజున విశ్వనాథ్ తుది శ్వాస విడిచారు.
విశ్వనాథ్ ను కళాతపస్విగా నిలిపిన ఫిబ్రవరి 2వ తేదీనే ఆయన తనువు చాలించారని తెలిసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. డైరెక్టర్ గానే కాకుండా.. నటుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు. తొలిసారి శుభసంకల్పం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఆయన ..వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు చిత్రాల్లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నారు. విశ్వనాథ్కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఆయనకు దక్కింది. చివరి మూవీ శుభ ప్రదం. తెలుగు తెరకు ఇటువంటి సేవ మళ్లీ దొరకునా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.