
k viswanath passed away
K Viswanath : ఇటీవల టాలీవుడ్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణంరాజ, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, దర్శకుడు సాగర్ ఇలా పలువురు ప్రముఖులు వరుసగా మృతి చెందారు. వారి మృతిని జీర్ణించుకోకముందే తాజాగా లెజండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ కన్నుమూసారు. గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. గత కొద్దీరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య సమస్య తీవ్ర కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఇండస్ట్రీకి ఏమైంది..
k viswanath passed away
విశ్వనాథ్ పూర్తి పేరు ఆయన పూర్తి పేరు కాశినాథుని విశ్వనాథ్. ఆయన 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించగా, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. అయితే సినిమాలపై అభిమానంతో చిత్రసీమలో అడుగుపెట్టిన విశ్వనాథ్ 1965లో దర్శకుడిగా మారి ఆత్మగౌరవం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. ఆయన తెరకెక్కించిన సినిమాలలో శంకరాభరణం చాలా స్పెషల్. ‘శంకరాభరణం’ 1980 ఫిబ్రవరి 2న విడుదలై మెల్లగా మౌత్ టాక్ తో మంచి పేరు సంపాదించి, ఆ యేడాది అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది. ఈ సినిమా 43ఏళ్లు పూర్తిచేసుకున్న రోజున విశ్వనాథ్ తుది శ్వాస విడిచారు.
విశ్వనాథ్ ను కళాతపస్విగా నిలిపిన ఫిబ్రవరి 2వ తేదీనే ఆయన తనువు చాలించారని తెలిసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. డైరెక్టర్ గానే కాకుండా.. నటుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు. తొలిసారి శుభసంకల్పం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఆయన ..వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు చిత్రాల్లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్నారు. విశ్వనాథ్కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఆయనకు దక్కింది. చివరి మూవీ శుభ ప్రదం. తెలుగు తెరకు ఇటువంటి సేవ మళ్లీ దొరకునా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.