Karthika Deepam 15 August 2022 Episode : హిమ చెప్పిన మాటలతో సౌర్య మారిపోతుందా.. వారణాసి వచ్చి ఏం చెప్తాడు..

 Authored By prabhas | The Telugu News | Updated on :15 August 2022,10:30 am

Karthika Deepam 15 August 2022 Episode : కార్తీకదీపం సీరియల్ . ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 1431 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… నిరుపం, ప్రేమ్ ని ఏమైంది నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ్ నిరూపముకి తను హిమ గురించి చెప్పాలి అని అనుకుంటాడు. కానీ తను ఎలా తీసుకుంటాడో అని మళ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సత్యం ,స్వప్న ఇద్దరూ నిరూపం ప్రేమ్లు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకపక్క నిరూపం పెళ్లి జరుగుతుంది అని సంతోష పడుతూ.. ఇంకొకపక్క ప్రేమ్ గురించి ఎందుకో ముభావంగా ఉంటున్నాడు వాడి సమస్య ఏంటో అడిగి తెలుసుకోవాలి అని సత్యం అంటాడు. అంతలో అక్కడికి ప్రేమ్ వస్తాడు. అప్పుడు ప్రేమ్ నీ సత్యం ఏమైంది అసలు నీ సమస్య ఏంటి చెప్పు ప్రేమ్ అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ్ చెప్పాలి అని అనుకుంటాడు. కానీ స్వప్న ఇప్పుడు ఏమి వద్దు పెళ్లి తర్వాత అన్ని మాట్లాడుకుందాం..

నాకు వినే అంత ఓపిక లేదు అని గుడికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే గుడిలో సౌర్య మా అమ్మానాన్నలు బ్రతికుంటే నాకు కనపడేలా చెయ్ దేవుడా అని అడుగుతుంది. సౌందర్య ఈ పెళ్లి సవ్యంగా జరిగి నా మనవరాలు ఇద్దరు సంతోషంగా ఒకటయ్యలా చెయ్యి దేవుడా అని అంటుంది. హిమ శౌర్య పెళ్లి బావతో జరిగేలా చెయ్యి దేవుడా అని అంటుంది. ఆనంద్ రావు నా ఇల్లు మునుపటిలాగా సంతోషంగా ఉండేలా చేయి అని అంటాడు. అప్పుడు హిమ శౌర్యకు అంతా చెప్పేయ్యాలి అని సౌర్యను పిలుస్తుంది. అప్పుడు నీతో మాట్లాడాలని నాకు లేదు అని సౌర్య అంటుండగా. హిమ బ్రతిమిలాడి తీసుకెళ్తుంది. అప్పుడు హిమ అమ్మానాన్నలు చివరి క్షణంలో ఏమన్నారో తెలుసా.. నిన్ను చూసుకోమని శౌర్య జాగ్రత్త అని చెప్పారు. అప్పుడు కారు లోయలో పడిపోయింది. నేనేమో ఒక చెట్టుకి చిక్కుకున్నాను అంట. నిన్ను పెంచిన పిన్ని, బాబాయ్ లే నన్ను కాపాడి ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటుంది. సౌర్యనీ నాటకాలు ఆపుతావా అని అంటుంది. ఈ దేవుడు సాక్షిగా చెప్తున్న సౌర్య నేను చెప్పేదంతా నిజమే ఇప్పుడు కూడా నీ పెళ్లి బావ తోనే జరిపించాలి అని కోరుకున్న అని చెప్తుంది.

Karthika Deepam 15 August 2022 Full Episode

Karthika Deepam 15 August 2022 Full Episode

ఆపుతావా మహానటి అని గట్టిగా ఉంటుంది. సౌర్య. అప్పుడు హిమ నేను ఎలా చెప్తే ఇది నిజమని నమ్ముతావు అని అంటుంది. అప్పుడు అమ్మానాన్నలు వచ్చి చెప్తే నేను నమ్ముతాను అని అంటుంది శౌర్య. అప్పుడు సౌందర్య అమ్మానాన్నలు ఎలా వస్తారు.. వాళ్ళు ఎలా చెప్తారు అని బాధపడుతూ అంటుంది. అంతలో అక్కడికి వారణాసి వచ్చి సౌర్య అమ్మ చెప్పింది నిజమే కార్తీక్ ,దీపములు బ్రతికే ఉన్నారు అని అంటాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడు వారణాసి కొన్ని సంవత్సరాల క్రిందట దీపమ్మ ఒక హాస్పిటల్లో కనిపించింది. తన కొన్ని రోజుల తర్వాత కోమాలో నుంచి బయటికి వచ్చింది. అలా బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ బాబు గురించి ఎంతో వెతికింది. బాధపడింది పిల్లల గురించి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగింది. కానీ ఎవరు నీ కోసం రాలేదు అని ఆ డాక్టర్ చెప్పాడంట అని ఇలా గతమంతా చెప్తూ ఉంటాడు వారణాసి తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి