నాగ చైతన్య కి నో చెప్పిన కీర్తి సురేష్ .. ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

నాగ చైతన్య కి నో చెప్పిన కీర్తి సురేష్ .. ?

నాగ చైతన్య కి కీర్తి సురేష్ నో చెప్పిందా.. అవునన్న మాటే వినిపిస్తోంది. ఆ మధ్య శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మజిలీ సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో జోడి కట్టి లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ చిత్రీకరణలో ఉండగానే మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు ఈ యంగ్ హీరో. కాగా రీసెంట్ గా లవ్ […]

 Authored By govind | The Telugu News | Updated on :10 January 2021,3:30 pm

నాగ చైతన్య కి కీర్తి సురేష్ నో చెప్పిందా.. అవునన్న మాటే వినిపిస్తోంది. ఆ మధ్య శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మజిలీ సినిమాతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో జోడి కట్టి లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ చిత్రీకరణలో ఉండగానే మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు ఈ యంగ్ హీరో. కాగా రీసెంట్ గా లవ్ స్టోరీ కంప్లీట్ చేసిన నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో తెరకెక్కనున్న థాంక్యూ సినిమా చేస్తున్నాడు.

Love Story First Look Teaser | Naga Chaitanya | Sai Pallavi | Sekhar  Kammula | YR creations - YouTube

ఇప్పటికే విక్రమ్ కే కుమార్ కి అక్కినేని ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. మనం సినిమా తర్వాత విక్రమ్ కే కుమార్ .. అక్కినేని ఫ్యామిలీలో ఒక మెంబర్ గా అయిపోయాడు. అందుకే ఎక్కువగా అక్కినేని హీరోలతోనే విక్రమ్ కే కుమార్ సినిమాలు చేస్తున్నాడు. కాగా నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో లీడ్ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం డైలమాలో ఉందట. ఈ సినిమా లో ముగ్గురు హీరోయిన్ లు నటించే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ లను ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు.

Vikram Kumar, Naga Chaitanya reunite for 'Thank You'- The New Indian Express

అవికా గౌర్, మాళవిక నాయర్ లను మేకర్స్ దాదపుగా ఫైనల్ చేసినట్టు లేటెస్ట్ అప్‌డేట్. అయితే లీడ్ రోల్ కి స్టార్ హీరోయిన్ ని తీసుకుందామన్న ఆలోచనలో ఉన్న దర్శక, నిర్మాతలు ..ఈ పాత్ర కోసం టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ను సంప్రదించారని టాక్. కానీ కీర్తి నో చెప్పిందని ఇండస్ట్రీ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ముగ్గురు హీరోయిన్ లు ఉన్న ఈ సినిమాలో తనకు అంతగా ప్రాధాన్యత లేదనుకునే నో చెప్పేసిందని చెప్పుకుంటున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుని ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. త్వరలో మహేష్ బాబు తో సర్కారు వారి పాట కూడా చేయబోతోంది. ఆ కారణంగానే ఈ సినిమా వదులుకుందని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ప్రస్తుతం పూజా హెగ్డే లేదా రష్మిక మందన్న లలో ఒకరిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది