Mahesh Babu – Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత జక్కన్న మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతవరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం జక్కన్న 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడని తెలుస్తుంది. స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కు రావడంతో జూన్ లేదా జూలై నెలలో లాంచింగ్ ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.
ఇక రాజమౌళి సినిమాను పక్క ప్రణాళికతో ఏడాదిలో ముగించేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2025లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కథను పూర్తి చేసే విషయంలో జక్కన్న, అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ బిజీగా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు రూపొందని విధంగా 800 కోట్ల బడ్జెట్ తో మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె. ఎల్ నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఇది అయిపోగానే జక్కన్న డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.