Mahesh Babu director gives clarity
Mahesh : మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మే 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహేష్ బాబు, పరశురామ్ మధ్య విభేదాలు ఉన్నాయని సినిమా విషయంలో మహేష్ సంతృప్తిని వ్యక్తం చేయలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. పరశురామ్ సినిమాలో హీరో లేకుండా ఒక్క సీన్ ను కూడా రాసుకోలేదని ఇలా చేయడం మహేష్ కు మరింత కోపం తెప్పించిందని ప్రచారం జరిగింది. కామెంట్లకు సంబంధించి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు పరశురామ్.
మహేష్ బాబు తనపై చిరాకు పడటం వాస్తవమేనని పెద్ద సినిమాలు చేసే సమయంలో కచ్చితంగా చిరాకులు ఉంటాయని పరశురామ్ చెప్పుకొచ్చారు.మూడు దశల కరోనా వలన ఒక స్క్రిప్ట్ ను మూడేళ్ల పాటు మోసాను. అంత కాలం మోయడం కష్టమైన పని అని ఆ ఒత్తిడిలో ఒకట్రెండు ఘటనలు జరిగినా మహేష్ మాత్రం తనను సోదరుడిలా చూసుకున్నాడని పరశురామ్ వెల్లడించారు. మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ లో వేలు పెట్టరని ఇద్దరి మధ్య గొడవలు వచ్చేంత గ్యాప్ మాత్రం రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి సినిమాకు ప్రాక్టికల్ గా ఇబ్బందులు కచ్చితంగా ఉంటాయని ఆయన అన్నారు.
Mahesh Babu director gives clarity
అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయాల్సిన మూవీ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తే చిరాకు వస్తుందని అయితే ఆ చిరాకుల వల్ల సినిమాకు మాత్రం ఇబ్బంది కలగలేదని ఆయన వెల్లడించారు.గీత గోవిందం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా నేను ఈ సినిమా కథ రాసుకుని మహేశ్ బాబుగారికి వినిపించాను. ఈ కథను మహేశ్ చాలా ఎంజాయ్ చేస్తూ విన్నారు. దానిని బట్టే ఆయనకి ఈ కథ నచ్చిందనే విషయం నాకు అర్థమైపోయింది. కథ చాలా బాగుందంటూ మహేశ్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నారని ఆయన అడిగితే కీర్తి సురేశ్ అని చెప్పాను. అందుకు ఆయన ఓకే అనేశారు. సర్కారు వారి పాట సినిమాకు ఒకే టైటిల్ ను అనుకున్నానని ఆ టైటిల్ నే ఫిక్స్ చేశానని పరశురామ్ అన్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.