Mahesh Babu : నమ్రత కాకుండా.. ఆమె వంట చేస్తే మహేశ్బాబు లొట్టలేసుకుంటూ తింటారట.. ఇంతకీ ఎవరు ఆమె..?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్బాబు.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఎన్ని చరిత్రలను తిరగరాసింది. కలెక్షన్ల సునామీలకు సైతం సృష్టించింది. నీడ మూవీతో బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన మహేశ్ బాబు.. అనేక చిత్రాల్లో నటించాడు. రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతో ఆయన నంది అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. ఇక మురారీ మూవీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవరసరమే లేదు. ఈ మూవీ పాటలకు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తర్వాత పలు చిత్రాలు నిరాశపరిచినా..
ఒక్కడు మూవీతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ పెద్ద హిట్. 2005లో వచ్చిన అతడు మూవీ మహేశ్లోని మాస్ యాంగిల్ను చూపిస్తే.. ఆ తర్వాత వచ్చిన పోకిరి మూవీ ఇండస్ట్రీలోని రికార్డులన్నీంటినీ తిరగరాసింది. ఇక భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ మూవీతో హ్యట్రిక్ అందుకున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీలో బిజీగా ఉన్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్కు వచ్చిన మహేశ్ బాబు.. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తన అమ్మమ్మ చేతి వంటలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.

Mahesh Babu likes her food Without namrita shirodkar
Mahesh Babu : మిస్ అవుతున్నా..
ప్రస్తుతం ఆమె లేకపోవడంతో అవన్నీ మిస్ అవుతున్నానని ఫీల్ అయ్యాడు. తన అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని చెప్పాడు. తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పాడు మహేశ్ బాబు. నువ్వు కూడా బాగా తింటావ్ కదా అంటూ ఎన్టీఆర్ ను కాస్త ఆట పట్టించాడు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో సర్కారు వారి పాట మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేశ్ ఓ మూవీ చేయబోతున్నారట. మరో వైపు ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది.