Mahesh Babu : తారక్ తో ఆ విషయం చెబుతూ ఏమోషనల్ అయిన మహేష్ బాబు 25 లక్షలు ఆ ఛారిటీ కోసమే..!

Advertisement
Published by
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యహరిస్తోన్న కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా విజయవంతంగా ప్రసారమైన ఈ సీజన్‌ కు సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ అప్పియరెన్స్ తో అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు షో మేకర్స్. కొద్ది రోజుల క్రితం విడుదలైన ప్రోమోతో ఈ ఏపీసోడ్ పై ఇరువురి హీరోల అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ కలసి ఒక స్టేజీపై తొలిసారి కలవబోతుండటంతో వారిద్దరూ ఏం మాట్లాడుకుంటారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ ఏపీసోడ్ బుల్లితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. షోలో మహేష్ 25 లక్షలు గెలుచుకోగా… ఈ ఇరువురి హీరోల మధ్య జరిగిన సంభాషణ ఆద్యంతం అలరించేలా సాగింది.గేమ్ లో భాగంగా… హోస్ట్ తారక్‌ అడుగుతున్న ప్రశ్నలకు మహేశ్ చక చక సమాధానాలు ఇస్తూ పోయారు.

Advertisement

అలాగే ఆ ప్రశ్నల మధ్య ఆయన తన జీవితానికి సంంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కుటుంబం గురించి మాట్లాడుతూ… తండ్రిగా పిల్లలతో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తానని తెలిపారు. ఇక తను ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా గురించి ప్రస్తావిస్తూ…. ఈ సినిమా పోకిరిలా ఉంటుందని అన్నారు. గేమ్ అలా సాగుతూ వెళ్తుండగా తారక్ కాసేపు ఆటను ఆపేసి మహేష్ ను ఓ ప్రశ్న అడిగారు. సాధారణంగా ఏ సెలబ్రిటీ వచ్చినా ఓ ఛారిటీ కోసం ఆట ఆడుతారని… తమరు ఏ ఛారిటీ కోసం ఆడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడిగారు.దీనిపై స్పందించిన మహేశ్… తాను ఎం.బీ ఫౌండేషన్ అనే ఛారిటీ ద్వారా ఇప్పటి వరకూ ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్స్ వారితో కలిసి పేదలకు వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

mahesh babu reveals his charity details in evaru milo kotishwarlu show

Mahesh Babu : సాయం చేయడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో..!

అందులో డబ్బు లేని పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు జరిపించినట్లు వివరించారు. ఆపరేషన్ సక్సెస్ అయిన అనంతరం.. ఆయా పిల్లలు తన ఫోటో చూసి నవ్వే ఓ చిరునవ్వు చూస్తే.. వారికి సాయం చేసే అదృష్టం తనకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తుందని చెబుతూ ఏమోషనల్ అయ్యారు.అలా ఈ షోలో మహేష్ మొత్తం 25 లక్షలు గెలుచుకున్నారు. ఆ మొత్తాన్ని తన ఛారిటీ తరఫున పేదల సంక్షేమం కోసం ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. ఇలా షో మొత్తం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు సూపర్ స్టార్ మహేష్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు బుల్లితెరపై సందడి చేయడం అభిమానులకు అలరించింది. మహేష్ బాబు ఇలాంటి గేమ్ షో లో పాల్గొనడం ఇదే తొలిసారి కాగా ఈ ఎపిసోడ్‌తో ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్‌ 1 ముగిసింది.

Advertisement

Recent Posts

Tipparthi : తిప్పర్తిలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన.. జూనియర్ కాలేజీ, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పనులపై కీలక ఆదేశాలు

Tipparthi : నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు (ఆర్ అండ్…

2 hours ago

12 Years Modi : మోదీ 12 ఏళ్ల పాలనలో దేశాన్ని మార్చిన 12 అద్భుత పథకాలు..!

12 Years Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ పాలనలో 12 సంవత్సరాల మైలురాయిని…

3 hours ago

Bharathiraja Passes Away : దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత.. 50 ఏళ్ల సినీ ప్రస్థానం, రూ.80 కోట్ల ఆస్తుల కథ

Bharathiraja Passes Away : దక్షిణ భారత సినీ పరిశ్రమలో మరో దిగ్గజం అస్తమించింది. తమిళ చిత్రసీమకు గ్రామీణ కథల…

4 hours ago

Viral Video : గుండెల్ని పిండేసే ఘటన.. ఎద్దు చనిపోవడంతో భార్యను కాడికి కట్టి పొలం దున్నిన రైతు..!

Viral Video : దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబాలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాయో చెప్పే మరో హృదయ విదారక…

5 hours ago

Heavy Rain Alert : దూసుకొస్తున్న రుతుపవనాలు… ఉరుములు, మెరుపులతో ఈదురుగాలుల‌తో భారీ వ‌ర్షాలు..!

Heavy Rain Alert  : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు…

6 hours ago

Farmers : రైతులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. పంట నష్టపోతే రూ.38 వేలు..!

Farmers : దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతుల…

6 hours ago

Komatireddy Venkat Reddy : పేదలకు ఇళ్లు.. రైతులకు మేలు.. నల్లగొండ జిల్లాపై మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక సమీక్ష

Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో Nalgonda అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు,…

7 hours ago

AP Thalliki Vandanam Scheme : ఏపీ తల్లులకు గుడ్ న్యూస్.. జూలైలోనే తల్లుల ఖాతాల్లో డబ్బులు..!

AP Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలపై…

9 hours ago

Students Good News : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇక నేరుగా ఖాతాల్లోకి.. సర్కార్ కీలక నిర్ణయం..!

Students Good News  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…

10 hours ago

PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. 23వ విడత కోసం నిధుల‌ కేంద్రం కీలక ప్రకటన..!

PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…

12 hours ago

Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. 2026 జూన్ 10న తాజా రేట్లు ఇవే!

Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…

13 hours ago