manchu vishnu decision gets into the trouble
Manchu Vishnu : మోహన్ బాబు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ఆనతి కాలంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఢీ సినిమాతో మంచు విష్ణుకి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ దక్కింది. అయితే కొన్నాళ్లుగా సరైన సక్సెస్లు దక్కించుకోలేకపోతున్నాడు మంచు విష్ణు. తాజాగా జిన్నా సినిమాతో అలరించే ప్రయత్నం చేయబోతున్నారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ‘జిన్నా’. సన్నీ లియోన్, పాయల్ రాజ్పూత్ హీరోయిన్లుగా నటించారు. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించగా,.
ఈ సందర్భంగా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఇక మలయాళ సినిమా ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ను మంచు విష్ణు రీమేక్ చేస్తున్నారట. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఈ సినిమాలో విష్ణు నటిస్తారట. ఇంత వరకు బాగానే ఉంది. ఎందుకంటే 2019లో వచ్చిన ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. సైంటిఫిక్ ఫిక్షనల్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ‘ఆహా’ కొనుగోలు చేసింది.
manchu vishnu decision gets into the trouble
తెలుగులో ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’గా అందుబాటులోకి తెచ్చింది.అయిన ఈ సినిమాను మంచు విష్ణు తెలుగులోనే రీమేక్ చేయడం నిజంగా సాహసమే. విష్ణు ఏడు సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేశారట. వీటిలో ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్’ ఒకటి. గతంలో మోహన్ బాబు మరియు విష్ణు పలు రీమేక్స్ లో నటించినప్పటికీ.. ఒకేసారి 7 ఇతర భాషల సినిమాల రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడం అనేది జరగలేదు. మరి ఈ రీమేక్స్ మంచు ఫ్యామిలీకి ఎలాంటి అనుభవాన్నిస్తాయో చూడాలి. చూస్తూ చూస్తూ ఈ రీమేక్లతో మంచు విష్ణు తన కెరీర్ని నాశనం చేసుకుంటున్నాడా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిన్నా సినిమాపైనే మంచు విష్ణు బోలడెన్ని ఆశలు పెట్టుకున్నాడు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.