Manchu Vishnu Ramayana : మంచు విష్ణు రామాయణపై క్రేజీ న్యూస్.. రాముడిగా ఎవరంటే..!
ప్రధానాంశాలు:
Manchu Vishnu Ramayana : మంచు విష్ణు రామాయణపై క్రేజీ న్యూస్.. రాముడిగా ఎవరంటే..!
Manchu Vishnu Ramayana : టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రామాయణం ఆధారంగా రూపొందించబోయే సినిమా కోసం ఇప్పటికే ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన ఎన్నుకున్న తారాగణం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.లార్డ్ శ్రీరాముడిగా – సూర్య, సీతాదేవిగా – ఆలియా భట్,రావణాసురుడిగా – మోహన్ బాబు, హనుమంతుడిగా – మంచు విష్ణు, ఇంద్రజిత్గా – కార్తి , జటాయువుగా – సత్యరాజ్.

Manchu Vishnu Ramayana : మంచు విష్ణు రామాయణపై క్రేజీ న్యూస్.. రాముడిగా ఎవరంటే..!
Manchu Vishnu Ramayana : క్రేజీ ప్రాజెక్ట్..
ఈ తారాగణంతో రామాయణాన్ని తెరకెక్కించాలని మంచు విష్ణు 2009లోనే ప్లాన్ చేశారట. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే, భారీ బడ్జెట్ కారణంగా ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని విష్ణు తెలిపారు.”నా దృష్టిలో రావణుడిగా నా నాన్న మోహన్ బాబు కంటే సరైన వ్యక్తి మరెవ్వరూ ఉండలేరు. ఆయన పాత్రకు న్యాయం చేయగల సింగిల్ పర్సన్ ఆయనే!” అని మంచు విష్ణు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ప్రకటనను అభిమానులు, సినీ ప్రియులు భారీ ఆసక్తితో గమినస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మళ్లీ సెట్స్ పైకి వస్తే , భారతీయ మైథలాజికల్ సినిమాల్లో ఓ మైలురాయిగా నిలిచే అవకాశముంది. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ వెనక ఉన్న సంకల్పాన్ని, మక్కువను చూస్తే…త్వరలోనే స్టార్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.