namratha shirodkar reminds his father post viral
Namratha Shirodkar : నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబును పెళ్లి చేసుకోవడానికి ముందే తను హీరోయిన్. అగ్ర హీరోల సరసన ఆడిపాడింది ఈ మరాఠీ భామ. తనది మహారాష్ట్ర. అయినా కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు కొనసాగింది. మెగాస్టార్ చిరంజీవితో కూడా అంజి సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత వంశీ సినిమాలో మహేశ్ బాబు సరసన నటించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు పేరెంట్స్ అయ్యారు.
namratha shirodkar reminds his father post viral
అయితే.. నమ్రత శిరోద్కర్ కు పెళ్లి తర్వాత ఎక్కువ పాపులారిటీ వచ్చింది. దానికి కారణం మహేశ్ బాబు. అవును.. సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య అంటే మామూలుగా ఉండదు కదా. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరం అయింది. అయినా కూడా మహేశ్ ఆర్థిక వ్యవహారాలు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుంది. నమ్రత, మహేశ్ బాబుది ప్రేమ పెళ్లి అని తెలుసు కదా. పెళ్లి తర్వాత నమ్రత ఇంటి బాధ్యతలు చూసుకోవడం కోసం సినిమాలు మానేసింది. సోషల్ మీడియాలోనూ నమ్రత యాక్టివ్ గా ఉంటుంది.
namratha shirodkar reminds his father post viral
ఇటీవల సోషల్ మీడియాలో నమ్రత తన తండ్రి ఫోటోను షేర్ చేసి.. తన తండ్రిని ఒకసారి గుర్తు చేసుకుంది. 16 సంవత్సరాలుగా నిన్ను మిస్ అవుతూనే ఉన్నా పప్పా. నీ ప్రతి మెమోరీ నా మదిలో అలాగే ఉండిపోయింది. ఏం మారలేదు.. త్వరగా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావు పప్పా.. అంటూ నమ్రత ఎమోషనల్ అయింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమ్రతా తండ్రి 16 ఏళ్ల కిందనే చనిపోయారు. అప్పటి నుంచి నమ్రత తన తండ్రిని తలుచుకొని బాధపడుతూనే ఉంది. తాజాగా తండ్రిని గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.