Nandamuri Ramakrishna : జూనియర్ ఎన్టీఆర్ కు బాలకృష్ణ తో గొడవ .. ఎమోషనల్ అయిన నందమూరి ఫ్యామిలీ…!
Nandamuri Ramakrishna : నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు అయ్యారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న, చైతన్య కృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు. నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ Nandamuri Chaitanya krishna తాజాగా ‘ బ్రీత్ ‘ అనే సినిమాలో నటించారు. బసవతారకం ఎన్టీఆర్ బ్యానర్ పై సినిమాను స్వయంగా ఆయనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2 న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగింది.
ఈవెంట్లో నందమూరి ఫ్యామిలీ నుంచి మోహనకృష్ణ, జయకృష్ణ, రామకృష్ణ, Nandamuri Ramakrishna లోకేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ బసవతారకం ఆశీస్సులతో ఈ బ్యానర్ను నిర్మించామని, మంచి కథ ఉంటే సినిమా చేయాలని అనుకున్నాం. ఈ బ్రీత్ సినిమా ద్వారా కృష్ణ చైతన్యకు మంచి గుర్తింపు రావాలి. కృష్ణ చైతన్యకు మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తీసుకురావాలని విషెస్ తెలియజేశారు. మా వంశం నుంచి వచ్చిన ఆర్టిస్టులందరి లాగా కృష్ణ చైతన్య కూడా నిలదొక్కుకోవాలని, నందమూరి వంశానికి కీర్తి ప్రతిష్ట తీసుకురావాలని ఆశిస్తున్నాం అని అన్నారు.
ఇక హీరో కృష్ణ చైతన్య మాట్లాడుతూ మంచి మెసేజ్ ఉన్న సినిమా కావడంతో సొంత బ్యానర్ పై తీయాలని నిర్ణయించామని, ఎన్టీఆర్ బసవతారకం పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశామని , మంచి కథ ఉంటే సినిమా చేయాలని మా నాన్న జయకృష్ణ కూడా ప్రోత్సహించారు. కుటుంబ సంబంధాల కథాంశంతో ఈ సినిమా తీశామని, దర్శకుడు ప్రతి ఒక్కరిని గొప్పగా చూపించారని, బాలకృష్ణ కోడి రామకృష్ణ గోపాల్ రెడ్డి మంచి హిట్ కాంబినేషన్ అని, అలాగే మాది కూడా హిట్ కాంబినేషన్ అవుతుందని చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు.
