nayanathara talks about casting couch in cinema industry
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార కెరియర్ ఆరంభంలో కొన్నాళ్లు సినిమా ప్రమోషన్లకు వెళ్లిందేమో.. కానీ దాదాపు దశాబ్ద కాలంగా ఆమె సినిమా ప్రమోషన్లకు హాజరవ్వడం లేదు. బయట సినిమాల ప్రమోషన్లకే కాకుండా సొంతంగా నటించిన తన సినిమాల ప్రమోషన్లకు కూడా ఆమె ఆసక్తి చూపించదు. పదుల కోట్ల బడ్జెట్ పెట్టి నిర్మించిన సినిమాలను ప్రమోట్ చేసేందుకు నిర్మాతలు నానా కష్టాలు పడుతున్నా కూడా నయనతార కనీసం ఒక్క ప్రెస్ మీట్ లో పాల్గొనడం లేదంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం చేసేది కాదు. ఆ కారణంగా కూడా కొందరు నిర్మాతలు ఆమెను దూరం పెట్టడం జరిగింది. అయినా కూడా తన పద్ధతిని మార్చుకోను అంటూ తెగేసి చెప్పింది.
అదనపు పారితోషికం ఇచ్చిన కూడా గతంలో ప్రెస్ మీట్ కి కానీ ఈవెంట్ కి కానీ హాజరయ్యేందుకు ఆమె ఒప్పుకునేది కాదు. కానీ ఇప్పుడు ఆమె తన పద్ధతి మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె చాలా మార్చుకుంది ఈమె. సినిమాల ఎంపిక విషయం నుండి మొదలు పెట్టి పాత్రల ఎంపిక వరకు అనేక విషయాల్లో మార్పు కనిపిస్తుంది. అదే సమయంలో ఈమె తీసుకొనబోతున్న రెమ్యునరేషన్ కూడా వార్తల్లో నిలుస్తుంది.. గతంలో మూడు నుండి నాలుగు కోట్ల పారితోషకం తీసుకున్న నయనతార ఏకంగా డబుల్ చేసి తన పారితోషికంను 7 నుండి 8 కోట్లకు పెంచేసిందట.
nayanathara going to come promotion events coming days
ఇదే సమయంలో భారీ పారితోషకం ఇస్తే ఇక నుండి తాను నటించిన సినిమాల యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటాను అంటూ కూడా నిర్మాతలకు ఆఫర్ ప్రకటించింది. నయనతార తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. కానీ ఆమె భారీగా పారితోషికం పెంచడం అనేది వారికి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈమె తప్పకుండా నటిస్తుంది. అయితే అంత భారీ పారితోషం ఎవరిస్తారు అనేది చూడాలి. ఇకనుండి వరుసగా పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటానంటూ నయనతార ప్రకటించిన నేపథ్యంలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.