Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం నయన తార మూడు కోట్ల రూపాయల పారితోషికమును తీసుకుంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిబోతున్న సినిమా కోసం ఆమెను సంప్రదిస్తే ఏకంగా రూ. 6 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేసింది అంటూ తమిళ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
చిరంజీవి సినిమాకు మూడు కోట్లు తీసుకొని ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు రూ. 6 కోట్లు డిమాండ్ చేయడం ఏంటో అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి అభిమానులు ఇదెక్కడి న్యాయం.. వాళ్లకు ఒక రేటు మా హీరోకి ఒక రేటు ఏంటి అంటూ నయనతారని ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ మరియు చిరంజీవి సమాన స్థాయి హోదా ఉన్న హీరోలు వారితో కలిసి నటించేందుకు సమానమైన పారితోషికం తీసుకోవాలని ఇలా ఎక్కువ తక్కువ పారితోషికం తీసుకోవడం ఎక్కడి న్యాయం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. విషయం ఏంటంటే నయనతారకు ఇటీవలే ప్రియుడు విగ్నేష్ శివన్ తో పెళ్లి అయింది. పెళ్లి తర్వాత నయనతార సినిమాల సంఖ్య తగ్గించుకోవాలని భావిస్తుంది.
అయితే భారీ గా పారితోషికం పెంచి ఆ పారితోషికానికి ఓకే అనే వాళ్లకు మాత్రమే తన డేట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెను సంప్రదించిన సమయంలో ఆరు కోట్ల రూపాయల పారితోషికమును డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఆమె నటించేందుకు ఆసక్తిగా లేకపోవడం వల్లే ఏకంగా ఆరు కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో తప్పని పరిస్థితిలో మరో హీరోయిన్ వైపు అనిల్ రావిపూడి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.