Nayanthara :పెళ్లికి తెల్లారే వివాదాల్లోకి న‌య‌న‌తార దంప‌తులు.. క్ష‌మాప‌ణలు చెప్పక త‌ప్ప‌లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nayanthara :పెళ్లికి తెల్లారే వివాదాల్లోకి న‌య‌న‌తార దంప‌తులు.. క్ష‌మాప‌ణలు చెప్పక త‌ప్ప‌లేదుగా..!

Nayanthara : ఏడేళ్ల‌పాటు ప్రేమ‌లో మునిగి తేలిన నయనతార- విగ్నేష్ శివన్ జంట వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన విష‌యం తెలిసిందే. పెళ్లైన మరుసటి రోజే చేదు అనుభవం ఎదురైంది. అలా పెళ్లైందో లేదో ఇలా ఊహించని రీతిలో సమస్య వచ్చి పడింది. అది కూడా పవిత్ర దేవస్థానం తిరుమల రూపంలో. దీంతో ఈ ఇష్యూని పెద్దది చేయడం ఎందుకని భావించి క్షమాపణలు కోరారు నయన్ భర్త విగ్నేష్ శివన్. కాళ్లకు చెప్పులు ధరించి తిరుమల మాడ వీధుల్లో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :11 June 2022,6:30 pm

Nayanthara : ఏడేళ్ల‌పాటు ప్రేమ‌లో మునిగి తేలిన నయనతార- విగ్నేష్ శివన్ జంట వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన విష‌యం తెలిసిందే. పెళ్లైన మరుసటి రోజే చేదు అనుభవం ఎదురైంది. అలా పెళ్లైందో లేదో ఇలా ఊహించని రీతిలో సమస్య వచ్చి పడింది. అది కూడా పవిత్ర దేవస్థానం తిరుమల రూపంలో. దీంతో ఈ ఇష్యూని పెద్దది చేయడం ఎందుకని భావించి క్షమాపణలు కోరారు నయన్ భర్త విగ్నేష్ శివన్. కాళ్లకు చెప్పులు ధరించి తిరుమల మాడ వీధుల్లో నడవడం పట్ల తమిళ నటుడు విఘ్నేశ్ శివన్ క్షమాపణలు చెప్పారు. టీటీడీకి ఆయన తాజాగా ఒక లేఖ రాస్తూ.. తమ కాళ్లకు చెప్పులు ఉన్నాయన్న విషయాన్ని గమనించలేదన్నారు. శ్రీవారిపై ఎంతో నమ్మకం, భక్తి ఉన్నాయని చెబుతూ..

తెలియక చేసిన తప్పును మన్నించాలని వేడుకున్నారు. ‘‘తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలన్నది మా కోరిక. అందుకే గత నెల రోజుల్లో తిరుమలకు ఐదు సార్లు వచ్చి వెళ్లాం. కానీ, అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణ సేవలో పాల్గొనాలన్నది మా ఆలోచన. అదే ఆలోచనతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత ఆలయం ముందు ఫొటోలు తీసుకున్నది.. మా పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే. ఈ హడావిడిలో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు ఎంతో నమ్మకం ఉంది.

nayanthara husband says sorry

nayanthara husband says sorry

Nayanthara : క్ష‌మాప‌ణ‌లు కోరారు..

దయచేసి మమ్మల్ని క్షమించండి’’ అంటూ విఘ్నేశ్ శివన్ లేఖలో కోరారు. వివాహానంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన‌ కొత్త దంపతులు నయతార-విఘ్నేశ్‌ శివన్‌లు వివాదంలో చిక్కుకున్నారు. దర్శనాంతరం ఈ జంట తిరుమ‌ల కొండ‌పై శ్రీవారి ఆల‌యం చుట్టూ ఉన్న మాడ‌ వీధుల్లో తిరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విఘ్నేశ్ చెప్పులు విడిచి న‌డిచినా.. న‌య‌న‌తార మాత్రం చెప్పుల‌తోనే మాడ‌ వీధుల్లో తిరిగింది. అంతేకాకుండా శ్రీవారి ఆల‌యం ప్ర‌ధాన ద్వారానికి అత్యంత స‌మీపంలోనే వారు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ కావ‌డంతో, ఇది వివాదాస్ప‌దం అయింది..

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది