Nikhil Siddharth comments about drgs
Nikhil Siddharth : మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కేస్ బయటపడింది. ఇందులో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడిన సినీ నిర్మాత కేపీ చౌదరి ఈ కేసులో ఇరుక్కున్నారు. ఈయన కబాలి తెలుగు వర్షన్ కు నిర్మాతగా వ్యవహరించారు. అయితే మొన్న డ్రగ్స్ క్యారీ చేస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు అతని కారును, బ్యాగును, మొబైల్ ను హ్యాండోవర్ చేసుకొని రెండు రోజులు రిమైండ్ కి తరలించి విచారించారు. ఈ క్రమంలోనే అతని నుండి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది.
ఈ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత, అషూ రెడ్డి ఇంకా ఎంతోమంది ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నట్లు పోలీసులు అనుమాన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కేపీ చౌదరికి వందల కాల్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే కేపీ చౌదరికి అషూ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అని విచారిస్తున్నారు. ఇంకా కేపీ చౌదరి ఫోన్లో చాలామంది సెలబ్రిటీల ఫోటోలు ఉన్నాయి. వాళ్లతో ఫోటోలు దిగినంత మాత్రాన వాళ్లు డ్రగ్స్ తీసుకున్నట్లేనా అని కేపీ చౌదరి మీడియాను ప్రశ్నించారు.
Nikhil Siddharth comments about drgs
దీనిపై ఇంకా పూర్తి విచారణ జరగలేదు. ఈ క్రమంలోనే తాజాగా డ్రగ్స్ కేసుపై హీరో నిఖిల్ సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శనివారం నాడు హైదరాబాద్లో పోలీసులు ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ అనే కార్యక్రమంలో నిఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ నన్ను కూడా గతంలో డ్రగ్స్ తీసుకోవాలని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఎప్పుడు వాటి జోలికి పోలేదు. సినీ పరిశ్రమలో ఒకరు చేసిన తప్పు వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుంది. మీరు మాత్రం డ్రగ్స్ జోలికి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకండి అంటూ చెప్పుకొచ్చారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.