Nithin : నితిన్ చెక్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది. యూత్ స్టార్ నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో హిట్ కొట్టి ఫాం లోకి వచ్చాడు. అయితే బీష్మ తర్వాత వరసగా నాలుగు సినిమాలని లైనప్ చేసి పెట్టుకున్నాడు కాని కరోనా కారణంగా ఆ సినిమాలన్నిటికి బ్రేక్ పడింది. కాగా నెల వ్యవధిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చెక్, రంగ్ దే ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు డిఫ్రెంట్ జోనర్స్ లో తెరకెక్కాయి.
వాస్తవంగా రంగ్ దే సినిమా ముందు రిలీజ్ కావాల్సి ఉండగా కొంత టాకీ పార్ట్ మళ్ళీ రీ షూట్ చేయడం తో ఈ సినిమా కంటే ముందు చెక్ రిలీజ్ అవుతోంది. కాగా ఈ సినిమా గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్ర శేఖర్ యేలేటి – నితిన్ కాంబినేషన్ లో వస్తున్న థ్రిల్లర్ సినిమా ఇప్పటికే మంచి బిజినెస్ కూడా జరిగిందని టాక్ వస్తోంది. టాలీవుడ్ లో చంద్ర శేఖర్ యేలేటి సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే నితిన్ నటించిన చెక్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్.
అయితే నితిన్ మీద ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారని చెప్పుకుంటున్నారు. ప్రియా ప్రకాష్ కి టాలీవుడ్ లో హీరోయిన్ గా డెబ్యూ సినిమా. ఇక గత కొంతకాలంగా రకుల్ టాలీవుడ్ లో సక్సస్ కోసం ఎదురు చూస్తోంది. అందుకే ఈ సినిమా మీద ఈ ఇద్దరి బ్యూటీలు ఆశలన్ని ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్ చెక్ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో మరికొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన కృతి శెట్టి లాంటి ముగ్గురు, నలుగురు యంగ్ బ్యూటీస్ పోటీగా ఉన్నారు. చూడాలి మరి వాళ్ళని తట్టుకొని ప్రియా ప్రకాష్ నిలబడుతుందా లేదా. కాగా చెక్ ఈ నెల 19 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.