Guntur Kaaram : మహేష్ బాబు తాజా సినిమా ‘ గుంటూరు కారం ‘ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 13ఏళ్ల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఈ సినిమా మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి ఏ మాత్రం సరిపోలేదని, ఈ సినిమాలో చాలా తప్పులు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గుంటూరు కారం పేరే అసలు ఈ సినిమాకి తగ్గది కాదని చాలా సున్నితంగా వివరించారు. గుంటూరు కారం అనగానే ఫుల్ మాస్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటారని, అది ఈ సినిమాలో లేదని చెప్పుకొచ్చారు.
అలాగే గుంటూరు వాళ్ళబ్బాయి అన్న టైటిల్ పెడితే చాలా బాగా సెట్ అయ్యేదని, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ఆయన గుంటూరు ఫ్యామిలీకి చెందిన వాడని అర్థం అయి ఉండేదని అన్నారు. అలాగే సినిమాలో చాలా తప్పులు ఉన్నాయని తెలిపారు. ముందుగా మహేష్ బాబు స్టాండర్డ్ ఈ సినిమాలో లేదని ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యానని, సినిమా ఆర్డర్ ప్రేక్షకులకు ఎలా అర్థమైందో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఈ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ ఆడుకున్నారని, రెండోసారి ఈ సినిమా చూస్తే ఇంకా బాగా అర్థం అయ్యేది అని వివరించారు. 200 కోట్లతో తీసిన ఈ సినిమాకి 201 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. కానీ 300 కోట్లు వస్తేనే ఈ సినిమా వల్ల అందరికీ లాభం జరిగిందని సినిమా వాళ్ళు భావిస్తారని చెప్పుకొచ్చారు. 2022లో రావాల్సిన ఈ సినిమా 2024 లో వచ్చిందని పలు సమస్యల కారణంగా ఆలస్యం అయి ఉండొచ్చని చెప్పకొచ్చారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేక అద్భుతమైన సినిమాలు తీయగా, ఈ సినిమా మాత్రం ఎందుకో చాలా తేడాగా ఉందని అన్నారు. స్క్రీన్ ప్లే ఎందుకో అర్థం కాకుండా నడిపారు. హీరోతో ఒక చిన్న సంతకం పెట్టించుకునే లైన్ తో వచ్చిన ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ పండించడం చాలా కష్టం అని వివరించారు. అలాగే హీరోను ప్రేమలో పడేసి సంతకం పెట్టించుకోవాలని హీరోయిన్ ను దింపడం బాలేదని, పాజిటివ్ దృక్పథాలు కావని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మదర్ సెంటిమెంట్ మరింత డెవలప్ చేసుకుంటూ వెళితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని అన్నారు. అలాగే సినిమాలో నెగిటివ్ గా చూపించిన పాత్రలో మార్పులు చూపిస్తే బాగుండేదని, రియలైజేషన్ ఉండి ఉంటూ ఈ సినిమా మరింత రీచ్ చెయ్యదని చెప్పుకొచ్చారు. ఏమైనా మహేష్ బాబు సినిమాకు డబ్బు వచ్చినా హృదయానికి సంతృప్తి రాలేదని అన్నారు. ఇది చెప్పడానికి కష్టంగా ఉన్న ఇదే నిజమని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.