Chiranjeevi : మెగాస్టార్‌ను టార్గెట్ చేసిన పవన్, నాగబాబు.. కారణం ఇదేనా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chiranjeevi : మెగాస్టార్‌ను టార్గెట్ చేసిన పవన్, నాగబాబు.. కారణం ఇదేనా?

Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంటుంది.వీరు కుటుంబం పరంగా అంతా కలిసే ఉంటారు. కానీ పవన్ మాత్రమే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు వస్తూ వెళ్తుంటాడు.పెద్దగా ఫ్యామిలీతో పవన్ స్పెండ్ చేయడని ఇండస్ట్రీలో టాక్. పవన్ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటాడని టాక్. దీనికి ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా కారణమని అంటుంటారు. ఇక పొలిటికల్ పరంగా కూడా పవన్, నాగబాబు ఇటీవల చిరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వీరి మధ్య […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 August 2022,7:20 pm

Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంటుంది.వీరు కుటుంబం పరంగా అంతా కలిసే ఉంటారు. కానీ పవన్ మాత్రమే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు వస్తూ వెళ్తుంటాడు.పెద్దగా ఫ్యామిలీతో పవన్ స్పెండ్ చేయడని ఇండస్ట్రీలో టాక్. పవన్ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటాడని టాక్. దీనికి ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా కారణమని అంటుంటారు. ఇక పొలిటికల్ పరంగా కూడా పవన్, నాగబాబు ఇటీవల చిరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వీరి మధ్య ఈ వివాదాలు కొత్తేమీ కాదు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలపడం పవన్ కు నచ్చలేదట.. దీంతో కళ్యాణ్ బహిరంగంగానే చిరంజీవిపై చాలా విమర్శలు చేశారు.

కానీ తమ్ముడు అంత బహిరంగంగా విమర్శలు చేసినప్పటికీ చిరంజీవి మాత్రం సున్నితంగా ఖండించారు. ఇక ఆరెంజ్ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు ఆర్థికంగా చిక్కుల్లో పడితే చిరంజీవి ఆదుకోలేదనే రూమర్ ఉంది. కానీ, నాగబాబు అప్పుల్లో కూరుకుపోతే పవన్ సాయం చేశాడని నాగబాబు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ఆలోచన పరంగా పవన్, నాగబాబు ఒక విధంగా ఉంటే.. చిరంజీవి అందుకు భిన్నంగా ఆలోచిస్తారట.. ఈ క్రమంలోనే చిరంజీవి పవన్ కళ్యాణ్ కి రాజకీయ శత్రువులైన వారితో స్నేహంగా ఉండడం నాగబాబు కి పవన్ కళ్యాణ్‌కు నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Pawan Kalyan Nagababu who targeted Megastar Chiranjeevi Is this the reason

Pawan Kalyan, Nagababu who targeted Megastar Chiranjeevi Is this the reason

కాపు సామాజిక వర్గాన్ని జనసేన పార్టీ వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్, నాగబాబు నానా తంటాలు పడుతుంటే చిరంజీవి మాత్రం వైసీపీతో స్నేహంగా మెలగడం ఇద్దరు తమ్ముళ్ళకు అసలు నచ్చడం లేదంట.. చిరంజీవి వల్ల జగన్‌కు కాపు సామాజిక వర్గం నుంచి మద్దతు లభిస్తే జనసేన భవితవ్యం ఏం కావాలని వారు మదన పడుతున్నారట.. ఇదిలాఉంటే నాగబాబు ఓ వారం రోజులుగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసే పోస్టులు అగ్గి రాజేస్తున్నాయి.‘నేను అంత తొందరగా ఎవడిని వదులుకోను. ఒకవేళ వదులుకున్నాను అంటే ఇక వాడంత వెధవ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండడు’ అని పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ తన దగ్గరి వాళ్ళను ఉద్దేశించి నాగబాబు పెట్టడం గమనార్హం. ఇది చిరు గురించే పెట్టాడని కొందరు మాట్లాడుకుంటున్నారట..చూడాలి మరి అన్నదమ్ముల మధ్య రాజకీయ వివాదం ఎప్పుడు ముగుస్తుందో..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది