Prabhas and Pooja Hegde Conflicts between
Pooja Hegde : తెలుగులో ఇప్పుడు టాప్ బిజీ హీరోయిన్ల జాబితాలో పూజా హెగ్డే ముందుంది. తెలుగులో తక్కువ సినిమాలు చేసినా అన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో పూజ హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ అమ్మడు జోరు చూపిస్తోంది. తెలుగులో ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో చేసిన ‘రాధేశ్యామ్’ సినిమా ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా విడుదల వేళ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.అందరి చేత డార్లింగ్ అనిపించుకునే ప్రభాస్ తో పూజా హెగ్డేకు చేరిందని టాలీవుడ్ లో టాక్. వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త సోషల్ మీడియాలో దావాణంలా వ్యాపించింది.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక్కరితో అంటే ఒక్కరితో కూడా ఎలాంటి నెగిటివ్ కామెంట్ వినిపించని ప్రభాస్ గురించి ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అసలు వారిద్దరి మధ్యన ఏం జరిగిందని తెలుసుకోవాలని అందరూ అనుకోగా.. దానిపై హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది.ప్రభాస్, పూజా హెగ్డేలకు చెడిందనే వార్తలపై స్పందిస్తూ.. ‘ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. నిజానికి అతను నాకు, మా అమ్మకు కూడా ఇంట్లో తయారు చేసిన భోజనం తెప్పించాడు. అతడితో పని చేయడం మంచి అనుభవం’ అని పూజా హెగ్డే తెలిపింది.
Prabhas and Pooja Hegde Conflicts between
దీంతో సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నట్లు ప్రభాస్ తో ఎలాంటి గొడవలు జరగలేదని క్లారిటీ వచ్చేసింది.తెలుగులో పూజా హెగ్డే ప్రస్తుతం చిరంజీవి సినిమా ఆచార్యలో రాంచరణ్ కు జోడీగా నటిస్తోంది. అటు తమిళంలో విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అరబిక్ కుతు పాట ఇప్పటికే యూట్యూబ్ లో సంచలనంగా మారడం తెలిసిందే. కాగా పూజా హెగ్డే తెలుగులో ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా.. తెలుగులో టాప్ హీరోలతో పాటు, తమిళంలోనూ మంచి ఆఫర్లు అందుకుంది.
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…
Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంటాయి. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలు,…
Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…
Yoga Asanas : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్కు…
Yogandhra 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్…
Kubera First Day Collections : శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందానా కీలక పాత్రలో…
This website uses cookies.