Radhe Shyam : ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధం అయింది. వచ్చే వారంలో ప్రపంచ వ్యాప్తంగా పది వేల స్క్రీన్స్ ల్లో పైగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మూడు విషయాలు ప్రస్తుతం అభిమానులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా యాంటీ క్లైమాక్స్ ను కలిగి ఉంటుంది అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చనిపోతారు. సినిమా చివర్లో ముగింపు చాలా విషాదకరం గా ఉంటుంది అనేది ఆ వార్తల సారాంశం.ఇటీవలే ఆ వార్తలపై దర్శకుడు రాధాకృష్ణ స్పందిస్తూ ఈ సినిమాకు అలాంటి క్లైమాక్స్ ఏమీ ఉండదని.
. యాంటీ క్లైమాక్స్ అనే వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. కచ్చితంగా ఈ సినిమా ఒక మంచి ఫీల్ తోనే ముగుస్తుంది అనే నమ్మకం కలిగిస్తూ ఆయన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సినిమాలో టైటానిక్ షిప్ వంటి ఒక భారీ షిప్ ని చూపించబోతున్న ట్లుగా వార్తలు వస్తున్నాయి.క్లైమాక్స్ లో ఆ షిప్ గురించి చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయని అంటున్నారు. టైటానిక్ రేంజ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ స్థాయిలో షిప్పు ఉంటుందా, క్లైమాక్స్ ఉంటుందా అంటూ కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈ సినిమా లో జ్యోతిష్యుడి గా ప్రభాస్ కనిపించబోతున్నాడు.
విక్రమాదిత్య అనే జ్యోతిష్యుడు ఎలా విధిని ఎదిరించే ప్రయత్నం చేశాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. కథ సహజ దూరంగా ఉంది అనిపిస్తుంది. అంటే సహజత్వానికి దూరంగా ఉంది అనిపిస్తుంది. కనుక ఈ సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యు కోట్ల వసూళ్లను దక్కించుకుంటున్న ఈ సినిమా ముందు ముందు వందల కోట్లు దాటి అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ వర్గాల టాక్.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.