prabhas to act with Radhe Shyam beauty for his next movie
Prabhas : ప్రభాస్ పేరు ఎత్తగానే మనకు గుర్తొచ్చే సినిమా బాహుబలి. అవును.. బాహుబలి సిరీస్ తోనే ప్రభాస్ తన సత్తా చాటాడు. తనేంటో నిరూపించుకున్నాడు. పాన్ ఇండియా హీరో అయ్యాడు. తొలి పాన్ ఇండియా హీరో అవడమే కాదు.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత ప్రభాస్ కే దక్కుతుంది. అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్ తీసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. దానికి కారణం.. బాహుబలి లాంటి ఎక్స్ ట్రీమ్ క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూసిన ఆయన అభిమానులు.. అంతకు మించిన క్యారెక్టర్ తో రావాలని కోరుకుంటున్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు అంతగా ఆడకున్నా కూడా ప్రభాస్ రేంజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.
ఒక్క సినిమాకు ప్రభాస్ సుమారు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రాజెక్టు కే, సలార్ మూవీలు ప్రస్తుతం ఆయన చేతుల్లో ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో వచ్చే సినిమా మాత్రం పూర్తిగా కామెడీ మూవీ. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కానీ.. ప్రీ ప్రొడక్షన్స్ ను జరుపుకుంటోంది. రాధేశ్యామ్ సినిమాలో నటించిన భామ గుర్తుంది కదా. ఆ భామకు రాజా డీలక్స్ సినిమాలో చాన్స్ ఇవ్వాలని ప్రభాస్ అనుకున్నాడట. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
prabhas to act with Radhe Shyam beauty for his next movie
రెండో షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. మాళవిక మోహన్, ఆశిక రంగనాథ్, మెహ్రీన్ అని అంటున్నారు. అయితే.. మెహ్రీన్ ను పక్కన పెట్టి మూడో హీరోయిన్ గా రాధే శ్యామ్ లో నటించిన రిద్ధి కుమార్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభాసే కావాలని ఆ హీరోయిన్ ను తీసుకున్నాడట. రాధే శ్యామ్ లో తారా పాత్రలో రిద్ధి కుమార్ నటించిన విషయం తెలిసిందే. అయితే.. తనకు ఎలాంటి అవకాశాలు లేకపోయినా.. కావాలని ఈ సినిమాలోకి ప్రభాస్ తీసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటో మాత్రం తెలియదు. కానీ.. ఒక్కసారిగా తనకు పెద్ద సినిమాలో అవకాశం రావడంతో రిద్ధి కుమార్ ఎగిరి గంతేస్తోంది.
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
This website uses cookies.