sai pallavi good bye to movies
Sai Pallavi : తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ ఫిదా ‘ సినిమాలో హీరోయిన్గా నటించింది సాయి పల్లవి. ఆ సినిమాలో తన అందం, నటనతో అందరినీ ఫిదా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే గత కొద్దికాలంగా సాయి పల్లవి గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనీ, డాక్టర్ కావాలనీ చూస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దానికోసం ఆమె హాస్పిటల్ కూడా నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. అందుకనే కొత్త సినిమాల గురించి ఎటువంటి
అప్డేట్ ఇవ్వట్లేదని వార్తలు వస్తున్నాయి. తెలుగులో సాయి పల్లవి చివరిగా నటించిన సినిమా గార్గి. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకే ఈ వార్తలు మరింత వైరల్ గా మారాయి. తాజాగా వీటన్నింటికీ సాయి పల్లవి క్లారిటీ ఇచ్చేసింది. ‘ ప్రేమమ్ ‘ సినిమాతో నా సినీ కెరీర్ మొదలైంది. ఆ చిత్రం అంత పెద్దగా సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు, ఈ సినిమాల టీచర్ ఇమేజ్ను మార్చడానికి వేరే తరహా పాత్రలో నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాననీ తెలియజేసింది.
sai pallavi good bye to movies
అలాగే సాయి పల్లవి మాట్లాడుతూ నేను ఎంబిబిఎస్ చదివిన నటి కావాలని అనుకున్నాను. దీనికి నా పేరెంట్స్ ఎటువంటి అడ్డు చెప్పలేదని తెలిపింది. నేను నటించే సినిమాల లోని పాత్రలు ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని అనుకుంటాను. అందరూ కూడా నన్ను తమ ఆడపడుచులాగా భావిస్తుండడం చాలా సంతోషంగా ఉందని, మంచి కథ దొరికితే ఏ భాషలో నేను నటించడానికి రెడీ అని చెప్పింది. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పేసిందన్న వార్తలు నిజం కాదని తేలిపోయాయి. దీంతో సాయి పల్లవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.