Sai Pallavi : తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ ఫిదా ‘ సినిమాలో హీరోయిన్గా నటించింది సాయి పల్లవి. ఆ సినిమాలో తన అందం, నటనతో అందరినీ ఫిదా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే గత కొద్దికాలంగా సాయి పల్లవి గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనీ, డాక్టర్ కావాలనీ చూస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దానికోసం ఆమె హాస్పిటల్ కూడా నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. అందుకనే కొత్త సినిమాల గురించి ఎటువంటి
అప్డేట్ ఇవ్వట్లేదని వార్తలు వస్తున్నాయి. తెలుగులో సాయి పల్లవి చివరిగా నటించిన సినిమా గార్గి. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకే ఈ వార్తలు మరింత వైరల్ గా మారాయి. తాజాగా వీటన్నింటికీ సాయి పల్లవి క్లారిటీ ఇచ్చేసింది. ‘ ప్రేమమ్ ‘ సినిమాతో నా సినీ కెరీర్ మొదలైంది. ఆ చిత్రం అంత పెద్దగా సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు, ఈ సినిమాల టీచర్ ఇమేజ్ను మార్చడానికి వేరే తరహా పాత్రలో నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాననీ తెలియజేసింది.
అలాగే సాయి పల్లవి మాట్లాడుతూ నేను ఎంబిబిఎస్ చదివిన నటి కావాలని అనుకున్నాను. దీనికి నా పేరెంట్స్ ఎటువంటి అడ్డు చెప్పలేదని తెలిపింది. నేను నటించే సినిమాల లోని పాత్రలు ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని అనుకుంటాను. అందరూ కూడా నన్ను తమ ఆడపడుచులాగా భావిస్తుండడం చాలా సంతోషంగా ఉందని, మంచి కథ దొరికితే ఏ భాషలో నేను నటించడానికి రెడీ అని చెప్పింది. దీంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పేసిందన్న వార్తలు నిజం కాదని తేలిపోయాయి. దీంతో సాయి పల్లవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.