Shahrukh Khan – Prabhas : ‘ బాహుబలి ‘ సినిమా తర్వాత స్టార్ హీరోలంతా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ తమ క్రేజ్ ని పెంచుకుంటున్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అన్ని భాషలలో హీరోలు వీలైనంతవరకు తమ సినిమాను అన్నిచోట్ల విడుదల చేస్తూ ఉన్నారు. బాహుబలి సినిమా ఇండియన్ రూల్ ని పూర్తిగా మార్చేసింది అని చెప్పవచ్చు. దీంతో పాన్ ఇండియా సినిమాల ప్రహసనం మొదలైంది. దర్శక నిర్మాతలు కూడా కోట్లలో బడ్జెట్ పెట్టి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో హీరోల మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. దీంతో హీరో లు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా సినిమా ప్రాఫిట్ లో లాభాలు కూడా తీసుకునే విధంగా నిర్మాతలతో ఒప్పందం చేసుకొని డబ్బులు బాగా ఆర్టిస్తున్నారు. అయితే ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు దీనిని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ బ్రేక్ చేశారని తెలుస్తుంది. ఇటీవల షారుఖ్ ఖాన్ ‘ పఠాన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది.
అయితే పఠాన్ సినిమాకి షారుక్ ఖాన్ ఏకంగా 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రాఫిట్ లో 60 శాతం షారుక్ ఖాన్ కి ఇచ్చేందుకు నిర్మాత ఆదిత్య చోప్రా ముందుగానే కమిట్ అయ్యారు. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ పఠాన్ సినిమాకి రెమ్యూనరేషన్ తో పాటు సినిమా ప్రాఫిట్ షేర్ కూడా తీసుకున్నారు. దీంతో షారుక్ ఖాన్ కి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఇండియాలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా షారుక్ ఖాన్ నిలిచాడు. మొన్నటి వరకు ఆ ప్లేస్లో టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్ చేసి ఆ ప్లేస్ లోకి షారుఖ్ ఖాన్ నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చాడు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.