Shanmukh : ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారుతుందో ఊహించడం చాలా కష్టం. అప్పటి వరకు సరదాగా గడిపిన యూట్యూబర్ గాయత్రి రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లింది. . అద్భుతమైన భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తుండగా.. పాతికేళ్ల వయసులోనే ప్రముఖ యూ ట్యూబర్ గాయత్రి ఎకా డాలీ డీ క్రూజ్ దుర్మరణం పాలైంది. ఈమె మరణవార్త తెలుసుకుని తోటి నటీనటులు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంతా కన్నీటి సాగరంలో మునిగిపోయారు. నిన్నటి వరకు తమతో ఉన్న గాయత్రి ఈ రోజు లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఈమె మరణంపై ప్రముఖ నటి సురేఖ వాణి కూడా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేసింది.
గాయత్రి, రోహిత్ శుక్రవారం హోలీ సందర్భంగా ప్రిసం పబ్ కి వెళ్లారు అని తిరిగి వెళ్లే క్రమంలో కారు అతి వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ ద్వారా తేల్చారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 100-120 కిమీ వేగంతో ప్రయాణిస్తోందని మాదాపూర్ పోలీసులు మీడియాకు తెలిపారు. రోహిత్ కారు డ్రైవ్ చేశాడని.. అతడి పక్క సీట్ లో గాయత్రి కూర్చుని ఉంది. కారు ఫుట్ పాత్ ని ఢీ కొట్టడంతో ముందు టైర్లు ఊడిపోయాయి. క్షణాల్లో కారు పల్టీలు కొడుతూ దూరంగా పడింది. అద్దాలు పగిలిపోవడంతో గాయత్రీ కారులో నుంచి రోడ్డుపై పడి మృతి చెందినట్లు పోలీసులు తెలుపుతున్నారు.
గాయత్రికి టాలీవుడ్ లో చాలా మందితో పరిచయం ఉంది. గాయత్రి మరణించిన వార్త తెలియడంతో నటి సురేఖ వాణి విషాదంలో మునిగిపోయారు. గాయత్రితో ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ఈ అమ్మని విడిచి వెళ్లాలని ఎలా అనిపించింది అంటూ ఆమె ఎమోషనల్ కామెంట్స్ పోస్ట్ చేశారు. గతంలో సురేఖ వాణి తనకు రెండవ తల్లి లాంటివారు అని గాయత్రీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ని సురేఖ వాణి ఇప్పుడు కోట్ చేశారు. షణ్ముఖ్ కూడా గాయత్రి మృతిపై విచారం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ తో గాయత్రికి మంచి స్నేహం ఉంది. ఇదిలా ఉండగా వీరి కారు పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న హోటల్ మహేశ్వరి అనే మహిళపై పడింది. దీనితో ఆమె కూడా ప్రాణాలు విడిచారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.