Shweta Basu : కొత్త బంగారులోకం హీరోయిన్ ఇస్ బ్యాక్.. ఆ రోజు నా జీవితంలో మర్చిపోను! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shweta Basu : కొత్త బంగారులోకం హీరోయిన్ ఇస్ బ్యాక్.. ఆ రోజు నా జీవితంలో మర్చిపోను!

Shweta Basu : టాలీవుడ్‌ ఒకప్పటి హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ చాలా కాలం తర్వాత దర్శనమిచ్చింది. ఈ బ్యూటీ మళ్లీ మీడియా ముందుకు రావడంతో ఈమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ఎక్కడ పోయారని అడిగేవారు కూడా చాలా మందే ఉన్నారు. శ్వేతా బసు.. ఈ అమ్మడి అందం, అభినయం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనుకుంట.. పొట్టిగా ఉన్నా తన కళ్లతోనే మాయ చేసేస్తుంది. Shweta Basu : డార్క్ సీక్రెట్ ఆఫ్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :24 September 2022,12:00 pm

Shweta Basu : టాలీవుడ్‌ ఒకప్పటి హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ చాలా కాలం తర్వాత దర్శనమిచ్చింది. ఈ బ్యూటీ మళ్లీ మీడియా ముందుకు రావడంతో ఈమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ఎక్కడ పోయారని అడిగేవారు కూడా చాలా మందే ఉన్నారు. శ్వేతా బసు.. ఈ అమ్మడి అందం, అభినయం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనుకుంట.. పొట్టిగా ఉన్నా తన కళ్లతోనే మాయ చేసేస్తుంది.

Shweta Basu : డార్క్ సీక్రెట్ ఆఫ్ శ్వేతా బసు లైఫ్

తెలుగు చిత్రపరిశ్రమలో శ్వేతాబసు నటించిన సినిమాలు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చును. కొత్త బంగారు లోకం మూవీతో ఈ నటి తన కెరీర్‌లోనే అదిరిపోయే హిట్ అందుకుంది. ఆ తర్వాత రైడ్ సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత అస్సలు సినిమాల్లో కనిపించకుండా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. దీనంతంటికీ కారణం మీడియా వారే అని గతంలో ఆమె ఫైర్ అయ్యింది. శ్వేతా బసు ప్రసాద్ చాలా చిన్నవయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే.రెండు సినిమాల తర్వాత ఈ మద్దుగుమ్మకు సినిమాలు తగ్గిపోయాయి.దీంతో ఆమె అవకాశాల కోసం అడ్డదారులు తొక్కిందని వార్తలు వచ్చాయి.

Shweta Basu About Her Life And Movies In An Interview

Shweta Basu About Her Life And Movies In An Interview

ఓ రోజు ఏకంగా కొత్తబంగారులోకం హీరోయిన్ వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని వార్తలు వచ్చాయి.మీడియా కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రచారం చేయడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా ముగిసిపోయింది.దీంతో ఆ బాధ భరించలేక హైదరాబాద్ విడిచి కొంత కాలం తన ఇంటికి వెళ్లిపోయిందట. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించింది.తాజాగా మీడియా ముందుకు వచ్చిన శ్వేతా బసు ప్రసాద్ మాట్లాడుతూ.. తన లేటెస్ట్ మూవీస్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చాలా మారిపోయింది. క్లిమినల్ జస్టిస్ అనే వెబ్ సిరీస్‌లో ఈ అమ్మడు కీలక పాత్ర పోషించింది. దీనికి మంచి టాక్ రావడంతో అవకాశాలు కూడా వస్తున్నట్టు తెలిపింది. కాగా,గతంలో తన జీవితంలో జరిగిన డార్క్ డేస్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని ఈ నటి నేటికి తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతుందట..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది