Ansuya Sreemukhi : యాంకర్ అనసూయ శ్రీముఖి మధ్య కోల్డ్ వార్.. ఎవరు గెలుస్తారో మరి
Ansuya Sreemukhi అందాల యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తన అందం, అభినయంతో అటు బుల్లితెరపై, వెండితెరపై రాణిస్తుంది ఈ భామ. అయితే ఇటీవల ఓ చానెల్లో ప్రసారమవుతున్న మాస్టర్ చెఫ్ హోస్ట్గా తమన్నా తప్పుకోవడంతో.. ఆ స్థానంలో అనసూయ హోస్ట్గా ఎంపికయ్యారు.
అనసూయకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆనసూయకు గట్టి పోటీ ఇచ్చేందుకు మరో యాంకర్ శ్రీముఖి రెడీ అయిపోయింది. అదేలా అనుకుంటున్నారా.. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో మంచు లక్ష్మి హోస్ట్గా ఆహా భోజనంబు టాక్ షోను తీసుకొచ్చారు. ఇందులో విశ్వక్ సేన్, నవ్దీప్, అలీ, రకుల్ ప్రీత్ సింగ్లతో పాటుగా పలువురు కనిపించారు. వంటల గురించి చెబుతూనే కబుర్లను అందించే ప్రయత్నం చేశారు.

Sreemukhi hosts chef mantra in aha vs ansuya masterchef in gemini
కొన్ని ఎపిసోడ్స్ తర్వాత దీన్ని మధ్యలోనే ఆపేసినట్టు తెలుస్తుంది. తాజాగా యాంకర్ శ్రీముఖి హోస్ట్గా.. చెఫ్ మంత్ర ప్రోగ్రామ్ను తీసుకొస్తున్నారు. ఇందులో కూడా సెలబ్రిటీలతో ముచ్చట్లు చెప్పనున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే.. శ్రేయ, రెజీనా, సుహాస్ లతో షూట్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది.వంటల ప్రోగ్రామ్స్కు సంబంధించి బుల్లితెరపై అనసూయ, ఓటీటీలో శ్రీముఖి సందడి చేయనున్నారు.
Ansuya Sreemukhi : శ్రీముఖి వంటల ప్రోగ్రాం
దీంతో ఇద్దరు ఒకే రకమైన కార్యక్రమాల్లో పోటీ పడుతున్నారు. అయితే అనసూయ టెకాఫ్ చేసిన షో తొలి నుంచే దారుణమైన రేటింగ్స్ రావడంతో.. జనాలను అలరించడం లేదని అభిప్రాయం నెలకొంది. మరోవైపు సెలబ్రిటీలతో సాగే షో కావడంతో శ్రీముఖి చెఫ్ మంత్రకు అడ్వాంటేజ్ ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే అనసూయ క్రేజ్ ఏ మాత్రం తక్కువ కాదని.. ఆమె కోసమైనా షో చూసే వారు ఉంటారనే వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి, అనసూయ మధ్య పరోక్ష పోటీలో ఎవరూ గెలుస్తారో వేచిచూడాల్సిందే.
