Sri Reddy : శ్రీరెడ్డి, దగ్గుబాటి అభిరామ్ ఫస్ట్ నైట్ అక్కడే జరిగిందట.. పూసగుచ్చినట్టు అన్నీ చెప్పిన శ్రీరెడ్డి

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 30 December 2022, 2:00 pm

Sri Reddy : శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తను టాలీవుడ్ లో బిగ్ బాంబ్. మా ఆఫీసు ముందు తను చేసిన రచ్చ అందరికీ తెలుసు. అందరూ తనను వాడుకొని వదిలేశారని.. ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదని ఆ అక్కసుతో సోషల్ మీడియాలో అందరిపై విరుచుకుపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీరెడ్డి అటు రాజకీయ నాయకులు, ఇటు సినిమా వాళ్ల మీద చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. శ్రీరెడ్డి.. అప్పట్లో దగ్గుబాటి వారసుడు అభిరామ్ తో కలిసి తిరిగిందని..

వాళ్లకు సంబంధించిన పర్సనల్ ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిరామ్.. రామానాయుడు మనవడు కావడంతో ఆ ఘటన సంచలనం సృష్టించింది. శ్రీరెడ్డికి కూడా అభిరామ్ ఘటన మరింత పేరు తీసుకొచ్చింది. అభిరామ్ కూడా తనను శారీరకంగా వాడుకున్నాడంటూ శ్రీరెడ్డి ఆరోపణలు చేసి తనతో ఉన్న ఫోటోలను మీడియాకు లీక్ చేసింది. తాజాగా శ్రీరెడ్డి మరోసారి అభిరామ్ ను టార్గెట్ చేసింది. ఎందుకంటే.. నానక్ రామ్ గూడ దగ్గర ఉన్న రామానాయుడు స్టూడియోను దక్కించుకున్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ

sri reddy comments again on Daggubati family

sri reddy comments again on Daggubati family

Sri Reddy : మరోసారి అభిరామ్ ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

ఇప్పుడు ఆ స్టూడియోను ఔటర్ రింగ్ రోడ్డు పనుల కోసం తొలగిస్తోంది. అయ్యో.. ఆ స్టూడియోను మాయం చేసేస్తున్నారా? దాన్ని ఎందుకు తొలగిస్తున్నారు. నాకు, దగ్గుబాటి అభిరామ్ కు ఫస్ట్ నైట్ అక్కడే జరిగింది అంటూ శ్రీరెడ్డి తాజాగా మరోసారి అభిరామ్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. మీరు ఆ స్టూడియోను తీసేస్తే మా మెమోరీస్ మొత్తం పోతాయి.. అంటూ చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. తను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి